యాప్నగరం

Nandyal: వేప చెట్టుపై అద్భుత సన్నివేశం.. అమ్మవారి మహిమ అంటున్న భక్తులు

Banaganapalle Neem Tree Goddess రూపం చర్చనీయాంశమైంది. అమ్మవారి మహిమ అంటూ భక్తులు క్యూ కట్టారు. అమ్మవారి రూపానికి పసుపు, కుంకమలతో పూజలు చేస్తున్నారు.. నైవేద్యాలు కూడా పెడుతున్నారు. చెట్టును నరకడంతో అమ్మవారు ఆగ్రహం చెందారని స్థానికులు చర్చించుకుంటున్నారు. అందుకే ఇలా వేప చెట్టుపై రూపం వెలసిందంటున్నారు. ఇలాంటి తరహా ఘటన తూర్పుగోదావరి జిల్లాలా కూడా ఇటీవల జరిగింది. అక్కడ అమ్మవారు కళ్లు తెరిచారంటూ భక్తులు ఆలయానికి క్యూ కట్టారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 30 Nov 2022, 10:08 am

ప్రధానాంశాలు:

  • నంద్యాల జిల్లాలో వింత ఘటన
  • వేప చెట్టుపై అమ్మవారి రూపం
  • క్యూ కట్టిన భక్తులు, స్థానికులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Banaganapalle Neem Tree
నంద్యాల జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. వేపచెట్టుకి అమ్మవారి రూపం దర్శనమివ్వడంతో ప్రజలు ఆ చెట్టుకి పూజలు చేస్తున్నారు. బనగానపల్లె పట్టణం తెలుగుపేటలోని పాత బావి వద్ద ఉన్న వేప చెట్టు మొదలు భాగంలో అమ్మవారి రూపంతో ఆకారం ఏర్పడింది. దీన్ని గమనించిన కాలనీ వాసులు తమ ఇలవేల్పు జమ్ములమ్మ తల్లి వేప చెట్టుపై దర్శనం ఇచ్చిందంటూ పూజలు చేశారు.
వేపచెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడిందన్న సమాచారం బయటకు వ్యాపించడంతో పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన మహిళలు అక్కడికి తరలివచ్చారు. అమ్మవారి రూపానికి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు పెడుతున్నారు. ఈ వేపచెట్టు పైభాగాన్ని కొద్ది నెలల క్రితం తొలగించారు. చెట్టును నరకడం వల్లే అమ్మవారు ఆగ్రహించి ఇలా దర్శనమిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలియడంతో అద్భుతమంటూ బనగానపల్లె చుట్టు పక్కల జనాలు అమ్మవారి ఆకారాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి తరహాలోనే మరో ఘటన జరిగింది. కడియం మండలం కడియపులంక చింతలోని లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారి విగ్రహం కళ్లు తెరిచి ఉన్నట్లు కొంతమంది భక్తులు గుర్తించారట. వెంటనే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది.. అమ్మవారు కళ్లు తెరవడం చూసి అందరూ షాకయ్యారు. అమ్మవారి ఆలయంలో ఓ అద్భుత సన్నివేశం అంటూ భక్తులు భారీగా తరలి వెళ్లారు. కార్తీక మాసం కావడంతో నిజంగా అద్భుతమంటూ స్థానికులు చర్చించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది.. ఇప్పుడు తాజాగా నంద్యాల జిల్లాలో వేపచెట్టుపై అమ్మవారి ఆకారం చర్చనీయాంశమైంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.