యాప్నగరం

నంద్యాలలో విషాదం.. పెళ్లయిన కొద్ది గంటల్లోనే వరుడు మృతి

నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లయి కొన్ని గంటలు గడవకముందే నవ వరుడు ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 25 Jun 2022, 12:47 pm
నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వివాహమై కొన్ని గంటలు గడవక ముందే నవ వరుడు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వివరాల్లోకి వెళ్తే.. వెలుగోడు మండలానికి చెందిన శివ కుమార్‌కు తాజాగా పెళ్లి జరిగింది. అయితే ఇవ్వాళ తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తుండగా మండలంలోని మోత్కూరు వద్ద గుర్తు తెలియని ఆయనను ఢీకొంది. దీంతో శివకుమార్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. . వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే శివకుమార్‌ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.