యాప్నగరం

బఫూన్‌కి ఎక్కువ.. జోకర్‌కి తక్కువ.. పాణ్యం ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్

పత్తికొండ వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యానంతరం జగన్ వచ్చారు. ఫ్యాక్షన్ జోలికి పోకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. కానీ లోకేష్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అన్నారు.

Samayam Telugu 19 Jun 2021, 3:58 pm
కర్నూలు జిల్లా పెసరవాయి హత్యలపై టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. పులి కడుపున పులే పుడుతుంది.. నక్క కడుపున నక్కే పుడుతుందంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా మాట్లాడుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ వదిలేసి ప్రశాంతంగా ఉంటున్న తమపై ఆరోపణలు చేయడం భాధాకరమన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
katasani


లోకేష్ బఫూన్‌కి ఎక్కువ.. జోకర్‌కి తక్కువ అంటూ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య తరువాత వచ్చిన జగన్ ప్రజలను శాంతంగా ఉండాలని చెప్పారని.. కానీ లోకేష్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. ఆయనలా తిట్టాలనుకుంటే మేము తిట్టగలం.. మాది ఆ సంస్కృతి కాదని ఆయన అన్నారు.

హత్యకు గురైన ప్రతాప రెడ్డి వారం రోజుల కిందట తనతో మాట్లాడారని ఎమ్మెల్యే చెప్పారు. వాళ్లను చంపేందుకు ఎవరినీ ప్రోత్సహించాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. తమకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేసినట్లు నిరూపించాలని ఆయన సవాల్ చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.