యాప్నగరం

కర్రల సమరంలో కొత్త కోణం.. సీసీ ఫుటేజ్‌లో దొరికేశారు

Kurnool: దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో హోళగుంద మండలంలో దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు దాదాపు 12 గ్రామాల ప్రజలు రెండు వర్గాలు విడిపోయి.. కర్రలతో కొట్టుకుంటారు.

Samayam Telugu 21 Oct 2021, 4:05 pm
దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో హోళగుంద మండలంలో దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు దాదాపు 12 గ్రామాల ప్రజలు రెండు వర్గాలు విడిపోయి.. కర్రలతో కొట్టుకుంటారు. యుద్ధాన్ని తలపించే ఈ కర్రల సమరాన్ని ప్రతి ఏడాది నిర్వహించడం సాధారణమే అయినా.. ఇప్పుడు కొత్త కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి.
Samayam Telugu బన్నీ ఉత్సవం


ఇటీవల దసరా పండుగ సందర్భంగా బన్నీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కర్రల సమరంలో అనేక మంది తలలు పగిలిపోయాయి. బన్నీ ఉత్సవంలో కొంతమంది కావాలనే దాడులు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ పరిశీలంచి.. ఎల్లార్తి గ్రామానికి చెందిన 14 మందిని గుర్తించారు.

ఆ 14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పాత కక్షలు మనసులో పెట్టుకుని దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న బన్నీ ఉత్సవంలో ఉద్దేశపూర్వకంగా దాడులు గతంలో చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి వారిని పట్టుకుని శిక్షించాలని వారు పోలీసులను కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.