యాప్నగరం

కర్నూలు కొండారెడ్డి బురుజుపై ‘రాయలసీమ గర్జన’.. వికేంద్రీకరణకు మద్దతుగా భారీ సభ!

కర్నూలులోని చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు వద్ద పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన ‘రాయలసీమ గర్జన’ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 4 Dec 2022, 11:59 pm
పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన ‘రాయలసీమ గర్జన’.. కర్నూలులోని చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు వద్ద అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొండారెడ్డి బురుజుపై ‘రాయలసీమ గర్జన’ వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Samayam Telugu కొండారెడ్డి బురుజుపై రాయలసీమ గర్జన



ఇక, అంతకు ముందు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 5వ తేదీన కర్నూలులో రాయలసీమ గర్జన పేరుతో భారీ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాయలసీమ జేఏసీ, వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విధ్యార్థి యువజన సంఘాలు ఈ గర్జనలో పాల్గొంటాయని వెల్లడించారు.

రాయలసీమ బాగా వెనుకబడిందని, ఈ ప్రాంతానికి భౌగోళికంగా వాతావరణం అనుకూలంగా లేదన్నారు. వర్షాలు ఎపుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని.. అందుకే, 1937లో పెద్దల సమక్షంలో శ్రీభాగ్ ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆ ఒప్పందంలో పేర్కొందని గుర్తుచేశారు. అలాగే, కృష్ణ జలాలను 10 ఏళ్లు వాడుకోవాలని, అవసరమైతే పొడిగించాలని ఒప్పందం జరిగిందన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.