యాప్నగరం

శ్రీశైలం మల్లన్నకు కార్తీక మాసంలో భారీ ఆదాయం.. రికార్డ్ స్థాయిలో, ఎన్ని కోట్లంటే!

Srisailam Hundi Collection భారీగా వచ్చింది. కార్తీక మాసంలో భక్తులు భారీగా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా ఆదాయం పెరిగింది. స్వామివారి సేవలు, దర్శనం టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, తులాభారాలు, కేశ ఖండన ఇలా కొన్ని పథకాల ద్వారా ఆదాయం లభించిందని ఈవో లవన్న తెలిపారు. గతేడాది కంటే రూ.11.02కోట్ల ఆదాయం అధికంగా హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 Nov 2022, 6:43 am

ప్రధానాంశాలు:

  • శ్రీశైలం మల్లన్నకు భారీగా ఆదాయం వచ్చింది
  • కార్తీక మాసంలో గతేడాది కంటే ఎక్కువ ఆదాయం
  • కార్తీక మాసంలో శ్రీశైలంకు భారీగా పోటెత్తిన భక్తులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Srisailam Hundi Income
నంద్యాల జిల్లా (Nandyal District)లో శ్రీశైల (Srisailam) మల్లన్నకు కార్తీక మాసంలో భారీ ఆదాయం వచ్చింది. మహాక్షేత్రంలో అక్టోబరు 26 నుంచి నవంబరు 23 వరకు కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరగ్గా.. భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాసంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దాదాపు 10లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం భారీగా పెరిగిందని దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు.
కార్తీక మాసంలో శ్రీశైలం దేవస్థానాని (Srisailam Temple)కి రూ.30,89,27,503ల ఆదాయం (Srisailam Hundi Income) వచ్చింది. గతేడాది కంటే రూ.11.02కోట్ల ఆదాయం అధికంగా వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ మొత్తం ఆదాయం.. దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, లడ్డు ప్రసాదాలు, కంకణాలు, తులాభారం, కేశఖండన, ఆన్‌లైన్‌ సేవలు, హుండీ ఆదాయం, టోల్‌గేట్‌, విభూది, ప్రచురణల విక్రయాలు, వివిధ పథకాల ద్వారా వచ్చినట్లు ఈవో తెలిపారు.

మల్లన్నకు వచ్చిన మొత్తం ఆదాయంలో సాధారణ జమల ద్వారా రూ.19,95,73,883 వచ్చాయి. అలాగే భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా 6,73,79,922.. ఆన్‌లైన్‌ ద్వారా రూ.3,25,68,719, అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.94,04,979, ఉదయాప్తమాన సేవ ద్వారా రూ.8,08,928, ప్రదోషకాలసేవ ద్వారా రూ.22,35,324 ఆదాయం లభించిందని ఈవో లవన్న చెప్పారు. శ్రీశైలం మహాక్షేత్రానికి కార్తీక మాసంలో భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చిన భక్తులతో శ్రీశైలం గిరులు కిటకిటలాడాయి. దీంతో శ్రీశైలం దేవస్థానం ఈ నెల 23 వరకు స్వామివారి స్పర్శదర్శనం నిలిపివేశారు.

మరోవైపు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అభిషేకాలు, షోడషోపచార పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం భ్రమరాంబ అమ్మవారికి ప్రీతికరమైన గులాబీ, గన్నేరు, మల్లెలు, చామంతులు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనంలతో ఊయలను అలకరించారు. స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి సేవా మహా సంకల్పాన్ని పఠించారు. అలాగే అష్టోత్తరం, త్రిశతి, లలితాసహస్రనామాలు, ఖడ్గమాల, షోడశోపచార క్రతువులతో ఊయలసేవ, పల్లకీసేవలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇటు శ్రీశైల దేవస్థానం అభివృద్ధి పనులకు దాతలు రూ.1.40లక్షల విలువగల ఎలక్ట్రికల్‌ పరికరాలు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు అవుట్‌డోర్‌ లైటింగ్‌ ఆటోమేటిక్‌ స్విచ్‌లను విరాళంగా ఇచ్చారు. దాతలకు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శించుకున్నారు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాతలకు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.