యాప్నగరం

శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం కొత్త రికార్డు.. బంగారం, వెండి.. రూ. కోట్లలో!

శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం పెద్ద ఎత్తున లభించింది. రికార్డు స్థాయిలో రూ. కోట్లలో వచ్చింది. ఇంకా బంగారం, వెండి..!

Samayam Telugu 19 Jan 2021, 11:49 pm
కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం కళ్లు చెదిరే రీతిలో భారీగా వచ్చింది. దాదాపు నెల రోజులకు గాను రికార్డు స్థాయిలో రూ. 3.82 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చి చేరింది. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల పరివార ఆలయాల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. 35 రోజులకు గాను రూ. 3,82,23,900 భక్తుల కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. వీటితో పాటు బంగారం, వెండి కూడా భారీగా భక్తులు సమర్పించుకున్నట్లు వివరించారు.
Samayam Telugu శ్రీశైలం హుండీ ఆదాయం


బంగారం 153.900 గ్రాములు (1.53 కేజీలు), 4.700 కేజీల వెండి, 200 యూఎస్‌ డాలర్స్‌, 156 యూఏఈ ధిరమ్స్‌, 15 యూరోలు, ఐదు కెనడా డాలర్లు వచ్చాయని కేఎస్‌ రామారావు పేర్కొన్నారు.

ఇక, మంగళవారం ఆలయంలో కుమారస్వామికి పంచామృతాభిషేకాలు, బయలు వీరభద్రునికి ప్రదోషకాల పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. అలాగే అదే శివభక్త గణాలకు అధిపతి, క్షేత్ర పాలకుడైన వీరభద్రుడికి సాయం కాలం ప్రదోషకాల పూజలు శాస్తోక్తంగా నిర్వహించామన్నారు. ఆరుబయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామి వారికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం సంధ్యా సమయంలో నంది మండలంలో కొలువైన నందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.