ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు వెళుతున్న వారిని.. కేటుగాళ్లు ఏమార్చి ఏదో రకంగా మాయ చేసి మోసం చేస్తున్నారు. కార్డును తీసుకుని పిన్ నంబరు తెలుసుకుని.. డబ్బు డ్రా చేస్తున్నట్లు నటిస్తూ ఏటీఎం కార్డును మార్చివేసి మోసాలకు పాల్పడుతున్నారు. అయితే కర్నూలు జిల్లాలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తితో దుండగులు డబ్బులు తీసుకుని ఉడాయించారు.
ఆదోని పట్టణంలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన వ్యక్తిని కేటుగాళ్లు నిండా ముంచారు. శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన ప్రశాంత్సింగ్ నుంచి రూ.50 వేలు తీసుకుని పరారయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ శాఖకు డీలర్గా పని చేస్తున్న అతను.. ఖాళీ సమయంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో కలెక్షన్స్ వసూలు చేస్తాడు.
ఇలా వచ్చిన సొమ్మును నిర్మల్ థియేటర్ సమీపంలో ఉన్న ఓ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. ప్రశాంత్ సింగ్ను గమనించిన కేటుగాళ్లు.. డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా అని అడిగారు. మాట కలిపిన ఇద్దరు దుండగులు.. తమకు నగదు ఇస్తే ఫోన్ పే ద్వారా నగదు పంపిస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మిన ప్రశాంతిసింగ్ వారికి రూ.50 వేలు ఇచ్చాడు.
డబ్బులు తీసుకున్న దుండగులు.. ఓ కర్చీప్లో తీసుకుని చుట్టుకున్నారు. ఫోన్ పే ద్వారా నగదు పంపిస్తామని.. వారు ఎంతకు పంపలేదు. దీంతో వారిని ప్రశాంత్ సింగ్ నిలదీయగా.. ముందే చుట్టుకుని వచ్చి మరో కర్చీప్ మూటను వారు అతడికి ఇచ్చారు. రూ.500 నోటు కిందపడిపోయిందని వాళ్లు ప్రశాంత్ సింగ్కు చెప్పగా.. దాన్ని తీసుకునేందుకు కిందకు వంగిన సమయంలో అక్కడిని నుంచి ఊడాయించారు.
దుండగులు ఇచ్చిన కర్చీప్ మూటను విప్పి చూసిన ప్రశాంత్ సింగ్కు షాక్ తగిలింది. అట్ట ముక్కలు ఉండడంతో కంగుతిన్నాడు. దీంతో వెంటనే టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐ శ్రీరాములుకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోని పట్టణంలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన వ్యక్తిని కేటుగాళ్లు నిండా ముంచారు. శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన ప్రశాంత్సింగ్ నుంచి రూ.50 వేలు తీసుకుని పరారయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ శాఖకు డీలర్గా పని చేస్తున్న అతను.. ఖాళీ సమయంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో కలెక్షన్స్ వసూలు చేస్తాడు.
ఇలా వచ్చిన సొమ్మును నిర్మల్ థియేటర్ సమీపంలో ఉన్న ఓ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. ప్రశాంత్ సింగ్ను గమనించిన కేటుగాళ్లు.. డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా అని అడిగారు. మాట కలిపిన ఇద్దరు దుండగులు.. తమకు నగదు ఇస్తే ఫోన్ పే ద్వారా నగదు పంపిస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మిన ప్రశాంతిసింగ్ వారికి రూ.50 వేలు ఇచ్చాడు.
డబ్బులు తీసుకున్న దుండగులు.. ఓ కర్చీప్లో తీసుకుని చుట్టుకున్నారు. ఫోన్ పే ద్వారా నగదు పంపిస్తామని.. వారు ఎంతకు పంపలేదు. దీంతో వారిని ప్రశాంత్ సింగ్ నిలదీయగా.. ముందే చుట్టుకుని వచ్చి మరో కర్చీప్ మూటను వారు అతడికి ఇచ్చారు. రూ.500 నోటు కిందపడిపోయిందని వాళ్లు ప్రశాంత్ సింగ్కు చెప్పగా.. దాన్ని తీసుకునేందుకు కిందకు వంగిన సమయంలో అక్కడిని నుంచి ఊడాయించారు.
దుండగులు ఇచ్చిన కర్చీప్ మూటను విప్పి చూసిన ప్రశాంత్ సింగ్కు షాక్ తగిలింది. అట్ట ముక్కలు ఉండడంతో కంగుతిన్నాడు. దీంతో వెంటనే టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐ శ్రీరాములుకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.