యాప్నగరం

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు టీడీపీ దూరం.. ఆ కార్యక్రమం కూడా పోస్ట్‌పోన్

కర్నూలు జిల్లా ఆత్మకూరులో న్యూ వేడుకలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో వేడుకలకు ఉంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Samayam Telugu 30 Dec 2021, 8:46 pm
కర్నూలు జిల్లా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన బుడ్డా.. ఒమిక్రాన్ ఉధృతి కారణంగా కొత్త సంవత్సర వేడుకలకు టీడీపీ దూరంగా ఉంటుందన్నారు.
Samayam Telugu మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి


జనవరి 1వ తేదీన ఆత్మకూరులో నిర్మించిన నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలనుకున్నామని.. అయితే దానిని కూడా వాయిదా వేశామని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుక జరుపుకోవాలని బుడ్డా రాజశేఖర్ రెడ్డి కోరారు. కాగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుఫున శ్రీశైలం నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలించారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.