యాప్నగరం

YSRCP కార్యకర్త వీడియో ట్వీట్ చేసిన టీడీపీ.. మురిసిపోతున్న తెలుగు తమ్ముళ్లు

Kodumur Mla కు సొంత పార్టీ కార్యకర్త నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. సంక్షేమ పథకాలను తమకు రద్దు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తమ సొంత డబ్బులు ఖర్చు చేశామన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 18 Aug 2022, 12:42 pm
ఏపీలో గడప, గడపకు మన ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ పరిధిలో పర్యటించి.. ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడా ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతోంది. స్థానికుల నుంచి ప్రశ్నలతో పాటూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో అదే జరిగింది. కోడుమూరులోని కొండపేటలో ఎమ్మెల్యే సుధాకర్‌ను మహిళలు కొందరు నిలదీశారు.
Samayam Telugu Kurnool


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లారు. కాలనీవాసుల్లో ఒకరు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. తమకు వచ్చే పథకాలను ప్రస్తుతం ఏవో కారణాలు చెబుతూ తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గరుండి ఏజెంట్లను పెట్టి ఓటేయించిన నేరానికి బీటెక్‌ చదివే తన బిడ్డకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేకుండా చేశారని.. భార్యాభర్తలు ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. కారణాలు చెప్పి పథకాలు తొలగిస్తామని ముందే చెప్పి ఉంటే ఓట్లేయించేవాళ్లం కాదన్నారు.

ఈ వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. ‘చంద్రబాబుగారే బెస్ట్ అంటోంది ఈ వైసీపీ కార్యకర్త కుటుంబం. "ఓటేయించుకున్నప్పుడు పెట్టని రూల్స్, అధికారంలోకి వచ్చాక పెట్టి మాకు స్కీములు రాకుండా చేస్తారా? చంద్రబాబుగారు ఇలా ఎప్పుడూ చేయలేదు." అంటూ కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ ని నిలదీసిన వైసీపీ కార్యకర్త’అంటూ వీడియోను కూడా పొందుపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

అలాగే తమకు పథకాలకు సంబంధించి అన్ని అర్హతలున్నా తనకు పింఛన్‌ తొలగించారని మరో మహిళ ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ చంద్రబాబు పాలనలో ఆధార్‌ను మార్పించుకున్నారని.. ఇప్పుడు తమతో చెప్పి బాధపడుతున్నారెందుకు అన్నారు. పింఛన్‌ రాదు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఎమ్మెల్యే అనుచరుడు మండిపడ్డారట.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.