హైటెక్ కాలంలో కూడా కులం కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో కుల పెద్దల పేరుతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. ఇంకా పాత కాలం కట్టుబాట్ల పేరుతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో అలాంటి తరహా ఘటన జరిగింది. విచిత్రంగా కుల సంఘంలో సభ్యత్వం లేదని స్మశానంలో అంత్యక్రియశ్రీనివాసులు తల్లి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. ఆమె అంత్యక్రియలకు సొంత సామాజికవర్గానికి చెందినవారే కొందరు అభ్యంతరం చెప్పారు. లు అడ్డుకున్నారు. మిడుతూరు మండలం కడుమూరులో వృద్ధురాలు అనసూయమ్మ చనిపోయారు. ఆమె కుమారుడు శ్రీనివాసులు తల్లి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. ఆమె అంత్యక్రియలకు సొంత సామాజికవర్గానికి చెందినవారే కొందరు అభ్యంతరం చెప్పారు. కుల సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావని.. సంఘంలో సభ్యత్వం లేదంటూ అతడ్ని నిలదీశారు. అంత్యక్రియలు చేయనీయకుండా అడ్డుపడ్డారు. సభ్యత్వం తీసుకుంటేనే మృతదేహాన్ని స్మశానంలోకి అనుమతిస్తామన్నారు.
వెంటనే బాధితుడు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. చివరకు కులపెద్దలు రాజీ చేయడంతో సమస్య సద్దుమణిగింది. మృతదేహాన్ని పూడ్చడానికి ఒప్పుకున్నారు. శ్రీనివాసులు ఫిర్యాదుతో అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
వెంటనే బాధితుడు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. చివరకు కులపెద్దలు రాజీ చేయడంతో సమస్య సద్దుమణిగింది. మృతదేహాన్ని పూడ్చడానికి ఒప్పుకున్నారు. శ్రీనివాసులు ఫిర్యాదుతో అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.