యాప్నగరం

కర్నూలు: భర్తకు ఇంట్లోనే అట్ట పెట్టెలతో దహన సంస్కారాలు చేసిన భార్య.. కుమారుల వస్తారనే భయంతో!

Pattikonda Wife Conducts Her Husband Funerals పత్తికొండలో పోతుగంటి హరికృష్ణ ప్రసాద్‌ , లలిత భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు దినేశ్‌ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడ్డారు. ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో వెళ్లి చూశారు. సొంత భార్య భర్తను అట్ట పెట్టెలతో దహనం చేసింది. ఒక కొడుకు కెనడాలో ఉన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 May 2023, 2:21 pm

ప్రధానాంశాలు:

  • పత్తికొండలో దారుణం జరిగింది
  • భర్తకు ఇంట్లోనే అంత్యక్రియలు
  • కుమారుల వస్తారనే భయంతో
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pattikonda Wife Conducts Her Husband Funerals
ఇంట్లోనే భర్త శవానికి దహన సంస్కారాలు చేసింది ఓ భార్య. ఈ అమానవీయ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగింది. తేరు బజార్‌లో హరి ప్రసాద్, లలిత అనే దంపతులు నివాసం ఉంటున్నారు. హరి ప్రసాద్‌కు 60 ఏళ్లు.. మెడికల్ షాప్ నిర్వహించేవాడు. పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. అంతా సాఫీగా సాగిపోతున్న కుటుంబం.. ఏం జరిగిందో తెలీదు కానీ.. హరిప్రసాద్ శవం కాలుతూ కాలనీవాసుల కంట పడింది. భయాందోళనలతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.
ఇక హుటాహుటిన తేరు బజార్ చేరుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరు చూసి విస్తుపోయారు. ఏం జరిగిందని భార్య లలితను ఆరా తీశారు. తన భర్త గుండెపోటుతో చనిపోయారని ఆమె సమాధానమిచ్చిందట. ఎవరూ అందుబాటులో లేకపోవడంతో.. ఇంటి ఆవరణలోనే దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపిందట. ఇక ఆలస్యం చేయకుండా భర్త శవంపై పాత పుస్తకాలు, పాత చీరలు వేసి తానే దహనం చేసినట్లు చెబుతోందట. ఇదే విషయాన్ని అమెరికాలో ఉన్న తమ పిల్లలకు ఫోన్ చేసి చెప్పానని లలిత అంటోంది.
తమ కుమారులిద్దరూ సరిగా చూసుకోవడం లేదని.. ఆస్తి కోసమే తమ వద్దకు వస్తున్నారని ఆమె చెబుతున్నారు. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారని.. ఆ భయంతో తానే భర్తకు అట్టపెట్టెలతో దహన సంస్కారాలు పూర్తిచేసినట్లు కూడా చెబుతున్నారు. ఇంకాస్తా లోతుగా విచారణ చేసిన పోలీసులకు లలిత మానసిక స్థితి సరిగా లేదని అర్థమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.