కర్నూలు జిల్లాలో ఓ మహిళ చేసిన పనికి పోలీసులు, జనాలు పరుగులు పెట్టారు. నీళ్లలో గల్లంతైనట్లూ ప్రచారం జరగడంతో అందరూ గాలించడం ప్రారంభించారు. అందరూ హడావిడిగా ఉన్న సమయంలో ఆమె తాపీగా ఇంటికి వచ్చి అందరికి ట్విస్ట్ ఇచ్చారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లెకు చెందిన రసూల్బీ.. కూతురు, బంధువులు, ఇంటి పొరుగున ఉన్న మహిళలతో కలిసి మొత్తం పది మంది శుక్రవారం ఆటోలో బయలుదేరారు. ముందుగా తుమ్మలపెంట పొలిమేర సమీపంలో ఉన్న సుంకులమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి గొర్విమానుపల్లె సమీపంలోని లొక్కిగుండం వెళ్లారు. వీరంతా రామేశ్వరస్వామిని దర్శించుకోవాలని భావించారు.. అక్కడే గుండం నీటిలో దిగారు. రసూల్బీ గుండంలో గల్లంతైందని కూతురుతో పాటు తోటి మహిళలంతా చెప్పారు. అక్కడే ఉన్న పూజారి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు అక్కడికి చేరుకొని ఆచూకీ కోసం నీళ్లలోకి దిగి గాలించారు. రాత్రంతా అక్కడే ఉండి వెతికినా ఫలితం లేకుండా పోయింది. శనివారం రాత్రి వరకు గుండంలోని నీటిని బయటకు పంపి గాలించారు.
యువకులు నీళ్లలో ఎంత గాలించినా రసూల్ బీ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెతుకుతూనే ఉన్నారు. ఓవైపు జనాలంతా వెతుకుతుంటే.. మధ్యాహ్నం తాపీగా బస్సు దిగి రసూల్బీ ఇంటికి వెళ్లారు. ఆమె సురక్షితంగా వచ్చిందని తెలియడంతో స్థానికులు ఆమె ఇంటికి వెళ్లారు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకొుని రసూల్బీలో పాటు తాడిపత్రిలో ఉన్న ఆమె అక్క, బావలు శివమ్మ, కార్తీక్ దంపతులను తీసుకెళ్లారు.
భర్త, కూతురుకు ప్రాణగండం ఉందని రసూల్బీకి ఎవరో చెప్పారట. తాను మూడు రోజుల పాటు కనిపించ కుండా పోతే గండం తప్పి పోతుందని ఇలా చేసినట్లు ఆమె విచిత్రమైన సమాధానం చెప్పారు. ఆమె అనంతపురంలో ఉండి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసున్నారు.. కానీ భయపడి ఇంటికి తిరిగివచ్చారు. మొత్తానికి జనాల్ని, పోలీసుల్ని ఆమె హడలెత్తించారు.
యువకులు నీళ్లలో ఎంత గాలించినా రసూల్ బీ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెతుకుతూనే ఉన్నారు. ఓవైపు జనాలంతా వెతుకుతుంటే.. మధ్యాహ్నం తాపీగా బస్సు దిగి రసూల్బీ ఇంటికి వెళ్లారు. ఆమె సురక్షితంగా వచ్చిందని తెలియడంతో స్థానికులు ఆమె ఇంటికి వెళ్లారు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకొుని రసూల్బీలో పాటు తాడిపత్రిలో ఉన్న ఆమె అక్క, బావలు శివమ్మ, కార్తీక్ దంపతులను తీసుకెళ్లారు.
భర్త, కూతురుకు ప్రాణగండం ఉందని రసూల్బీకి ఎవరో చెప్పారట. తాను మూడు రోజుల పాటు కనిపించ కుండా పోతే గండం తప్పి పోతుందని ఇలా చేసినట్లు ఆమె విచిత్రమైన సమాధానం చెప్పారు. ఆమె అనంతపురంలో ఉండి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసున్నారు.. కానీ భయపడి ఇంటికి తిరిగివచ్చారు. మొత్తానికి జనాల్ని, పోలీసుల్ని ఆమె హడలెత్తించారు.