యాప్నగరం

అక్కడికి వెళ్లాలంటే రెండు మూడు బస్సులు మారాలి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యంతరం, ముఖ్యమంత్రిని కలుస్తాం..

డోన్ రెవెన్యూ డివిజన్‌లో బనగానపల్లెను కలపడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. డోన్‌కు వెళ్లాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని..

Samayam Telugu 27 Jan 2022, 4:34 pm
బనగానపల్లెను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. బనగానపల్లె నియోజకవర్గాన్ని జిల్లాల పునర్ విభజనలో భాగంగా డోన్ రెవెన్యూ డివిజన్‌లో కలపడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డోన్ రెవెన్యూ డివిజన్‌లో కలపడం వల్ల దూరం పెరిగి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు.
Samayam Telugu ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి



'డోన్‌కు వెళ్లాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. బనగానపల్లె నుంచి డోన్ చేరుకోవాలంటే బేతంచర్ల మీదుగా వెళ్లాలి. కోవెలకుంట్ల, సంజమాల, కొలిమిగుండ్ల ప్రాంతాల ప్రజలు డోన్‌కు రావాలంటే రెండు మూడు బస్సులు మారాల్సి ఉంటుంది. అందుకే బనగానపల్లెను ఓ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు బాగుంది..' అని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డితో కలిసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. బనగానపల్లె ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతామని చెప్పారు. నంద్యాల జిల్లాను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.