యాప్నగరం

గుండెపోటుతో కుప్పకూలిన 7వ తరగతి విద్యార్థిని.. వింజమూరులో విషాదం

నెల్లూరు జిల్లా వింజమూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడో తరగతి విద్యార్థినికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి ఆకస్మికంగా కన్నుమూసింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 7 Sep 2022, 8:47 pm
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు బాలుర ఉన్నత పాఠశాలలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడో తరగతి విద్యార్థినికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో తరగతి గదిలోనే మృతి చెందింది. ఏం జరిగిందంటే.. వింజమూరు బాలుర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఎస్ సాజిదా (13).. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధన చేస్తున్న సమయంలో ప్రశ్నలు అడగగా ఒకటి రెండు క్యూస్షన్లకు సమాధానం చెప్పింది. తర్వాత ఒక్కసారిగా కను గుడ్లు తేలేస్తూ అకస్మాత్తుగా కింద పడిపోయింది.
Samayam Telugu వింజమూరు పాఠశాల


ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనను చూసిన ఉపాధ్యాయులు ఆందోళనతో విద్యార్థినికి ఫిట్స్ వచ్చాయనుకొని తాళపు చెవులు చేతులో పెట్టి.. నీటితో మొహం కడిగారు. అనంతరం, హుటాహుటిన స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు అప్పటికే పాప మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో బీసీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.