యాప్నగరం

ఆత్మకూరు ఉపఎన్నిక విజయంపై స్పందించిన సీఎం జగన్..

CM YS Jagan | ఆత్మకూరు ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు.. విక్రమ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థిపై సుమారు 89 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా.. గౌతమ్‌కు నివాళిగా జగన్ ఈ విజయాన్ని పేర్కొన్నారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 26 Jun 2022, 3:57 pm

ప్రధానాంశాలు:

  • ఆత్మకూరు ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం
  • ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా.. గౌతమ్‌కు నివాళిగా గెలిపించారన్న జగన్
  • భారీ మెజార్టీ కట్టబెట్టిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన సీఎం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mekapati Gawtham-Jagan
Gawtham Reddy- Jagan
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో జరిగిన ఆత్మకూరు ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీ తరఫున పోటీ చేసిన గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి 19,352 ఓట్లకు పరిమితమయ్యారు. ఆత్మకూరులో ఘనవిజయం సాధించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఖుషీ అవుతున్నాయి.
ఆత్మకూరు బైపోల్‌లో వైఎస్సార్సీపీ విజయం పట్ల సీఎం జగన్ స్పందించారు. ‘ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా... ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి... ప్రతి అవ్వకు, ప్రతి తాతకు... పేరుపేరునా ధన్యవాదాలు’ అని జగన్ ట్వీట్ చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష! అంటూ జగన్ మరో ట్వీట్ చేశారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు, ఉపఎన్నికల్లోనూ.. వైఎస్సార్సీపీనే తిరుగులేని విజయాలు సాధించింది. చివరకు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలోనూ అధికార పార్టీ జెండా పాతింది. ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ పోటీకి దూరంగా ఉండగా.. బీజేపీ మాత్రమే బరిలోకి దిగింది. గత ఏడాది చివర్లో జరిగిన బద్వేలు ఉపఎన్నికలోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది.

వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో క‌డ‌ప‌ జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అధికార పార్టీ టికెట్‌ను డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. ఉపఎన్నికలో డాక్టర్‌ సుధ బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌పై 90,590 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.