యాప్నగరం

పిల్లలను కాపాడబోయి.. నలుగురు మృతి.. నెల్లూరు జిల్లాలో విషాదం

చెరువులో చిన్నారులు ముగినిపోతుండగా గమనించిన ఖలీల్ కాపాడేందుకు ప్రయత్నించాడు. తీరా బయటకు రాలేక చిన్నారులతో సహా ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 7 Jun 2021, 9:31 pm
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ పడిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఓజిలి మండలం రాజుపాళెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హేమంత్(6) చరణ్ తేజ(8), జాహ్నవి(12) ఆడుకునేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారు. నీటిలో మునిగిపోతున్న చిన్నారులను గమనించిన షేక్ ఖలీల్(45) వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. బయటకు రాలేక చిన్నారులతో పాటు అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. చెరువులో పడి నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
drown


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.