యాప్నగరం

జాతీయ జెండాకు అవమానం, మూడ్రోజులైనా అలాగే.. తొంగిచూడని అధికారులు

రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాకి ఘోర అవమానం జరిగింది. దేశ ప్రతిష్టను మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే జాతీయ జెండా పట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గణతంత్ర దినోత్సవం రోజు..

Samayam Telugu 28 Jan 2022, 3:18 pm
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాకి ఘోర అవమానం జరిగింది. దేశ ప్రతిష్టను మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే జాతీయ జెండా పట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గణతంత్ర దినోత్సవం రోజు ఆవిష్కరించిన జెండా నేటికి మూడు రోజులు గడుస్తున్నా.. అవనతం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. జాతీయ జెండాకు ఇంత ఘోరం జరిగినా ఏ ఒక్క అధికారి ఈ విషయంపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Samayam Telugu కావలిలో జాతీయ జెండా


వివరాలు ఇలా.. కావలి పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొందరు వ్యక్తులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాధారణంగా ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించడం సాయంత్రం సూర్యాస్తమయంలోపు జాతీయ జెండాను అవనతం చేయడం మనం జాతీయ జెండాకు ఇచ్చే గౌరవం.. కానీ జాతీయ జెండా ఆవిష్కరించి మూడు రోజులు గడుస్తున్నా అవనతం చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం అధికారులు సంచరించే పట్టణ నడిబొడ్డులో జాతీయ జెండాకు ఇంత అవమానం జరిగినా ఏ ఒక్క అధికారి ఈ విషయంపై దృష్టి సారించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.