యాప్నగరం

నెల్లూరులో ‘వారాహి’ సైకిల్స్‌కు అదిరేపోయే క్రేజ్.. ఎగబడుతున్న జన సైనికులు

Nellore Varahi Bicycles Craze కనిపిస్తోంది. సుధాకర్ మాధవ్ జనసేన పార్టీకి సంబంధించిన సింబల్‌ను, పవన్ కళ్యాణ్ ఫోటోను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ వారాహి సైకిళ్లను మార్కెట్లోకి వదిలగా.. మంచి క్రేజ్ వచ్చింది. ఈ సైకిళ్ల కోసం నెల్లూరులో జనసైనికులు ఎగబడుతున్నారు. స్థానికంగా ఈ సైకిళ్లకు భారీగా డిమాండ్ ఉందని.. ఆర్డర్లు కూడా వందల సంఖ్యలో వస్తున్నాయని ఆయన అంటున్నారు. మొత్తం మీద వారాహి క్రేజ్ నెల్లూరుకు పాకింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 16 Feb 2023, 10:12 am

ప్రధానాంశాలు:

  • నెల్లూరులో వారాహి సైకిళ్ల ట్రెండ్
  • కొనుగోలు చేస్తున్న జనసైనికులు
  • భారీ డిమాండ్.. ఆర్డర్లు కూడా ఫుల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nellore Varahi Cycles
వారాహి.. వారాహి.. కొద్దిరోజులుగా జనసైనికులు జపిస్తున్న నినాదమిది. జనసేనాని పవన్‌కళ్యాణ్ ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాహనానికి ‘వారాహి’ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. సకల హంగులతో తీర్చిదిద్దిన ఈ వాహనానికి కొద్దిరోజుల క్రితం కొండగట్టు అంజన్న ఆలయం, విజయవాడ దుర్గగుడిలో పవన్‌కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌పై అభిమానంతో కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ జనసైనికుడు వారాహి రంగుతో ఎలక్ట్రిక్ బైక్‌ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. ఇదే కోవలో నెల్లూరు నగరంలో వారాహి సైకిళ్లు సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నాయి.
గతంలో జనసేన పార్టీ సింబల్‌ను, పవన్ కళ్యాణ్ ఫోటోను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జనసేన సైకిళ్లను మార్కెట్లోకి వదిలిన సుధాకర్ మాధవ్.. తాజాగా వారాహి సైకిల్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. వారాహి రంగుతోనే సైకిళ్లను దిగుమతి చేసుకున్న ఆయన వాటిపై జనసేన పార్టీ సింబల్ గాజుగ్లాసు, పవన్ కళ్యాణ్‌ స్టిక్కర్లను అతికించి మార్కెట్లోకి విడుదల చేయగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. జనసైనికుల నుంచి నిత్యం వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తుండటం విశేషం.

తనకు పవన్‌కళ్యాణ్ అంటే ఎంతో అభిమానమని చెబుతున్న సుధాకర్ మాధవ్.. ఈ సైకిళ్ల ద్వారా జనసేన పార్టీ విధానాలను బలంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ‘వారాహి’ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. వారాహి సైకిళ్లకు నెల్లూరు నగరంలో విపరీతమైన డిమాండ్ ఉందని.. రోజూ వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. డిమాండ్‌కు తగినట్లుగా తాము సరఫరా చేయలేని పరిస్థితి నెలకొని ఉందని.. ఈ విషయంలో చాలా ఒత్తిడికి గురవుతున్నామని మాధవ్ చెబుతున్నారు. జనసేన పార్టీకి తనవంతు ఏదైనా చేయాలన్న సంకల్పంతోనే ‘వారాహి’ సైకిళ్లను ప్లాన్ చేశామని.. అంతేతప్ప పార్టీలో పదవులు ఆశించి కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.