మాజీ మంత్రి అనిల్కుమార్ అహంకార సభ అట్టర్ ఫ్లాప్ అయిందని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ అన్నారు. ఆయన ఉచిత సలహాలు వైఎస్సార్సీపీ నాయకులకు ఇచ్చుకోవాలని హితవు పలికారు. అనిల్ కుమార్ అహంకార సభ అట్టర్ ఫ్లాప్తో నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో కూడా ఫూల్ అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏమి ఉపయోగపడని ఒక అజ్ఞానిని గెలిపించుకుని నెల్లూరు ప్రజలు బాధ పడుతున్నారని అన్నారు.
'నిన్నటి నీ అహంకార సమావేశం పొలిటికల్ కెరీర్ సూసైడ్లా ఉంది. అహంకార సభ, నీ సొంత డబ్బా సభకు నెల్లూరు సిటీ సెంటర్లో ఎలా పర్మిషన్ ఇచ్చారు. దీని వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. నీ సొంత డబ్బా ఏదైనా గ్రౌండ్లో ఏ ఫంక్షన్ హాల్లో పెట్టుకోవచ్చుగా.. మంత్రిగా ఉన్నప్పుడే నువ్వు నెల్లూరుకి చేసింది ఏమీలేదు గాని మాజీ మంత్రి అయిన తరువాత ఇప్పుడు చేస్తాను చూడండి.. అంటే నమ్మటానికి ప్రజలు ఏం అమాయకులు కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డికి పోటీగా సభ పెట్టి కనీసం ఒక్కమాట కూడా కాకానిని అనే ధైర్యం లేకపోయిందని ప్రజలందరూ భావిస్తున్నారు. అనిల్ నువ్వు నెల్లూరు ప్రజలకు చేసింది నిల్..' అని చెన్నారెడ్డి మనుక్రాంత్ అన్నారు.
అనిల్ అహంకార సభ కాకాని విజయోత్సవ సభ రెండూ ప్రజలకు దేనికి ఉపయోగపడని సభలేనని ఆయన అన్నారు. ఈ వైఎస్సార్సీపీ బాదుడే బాదుడు పాలనలో ప్రజలు పూర్తిగా వ్యతిరేకత ఉందని.. వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న ఒక్కమాటకు వైఎస్సార్సీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. మళ్లీ తానే మంత్రినవుతానని అనిల్ కుమార్ యాదవ్ అహంకారంగా మాట్లాడుతున్నారని.. నెల్లూరు ప్రజలకు ఏమి ఉపయోగం చెప్పాలన్నారు. నెల్లూరు ప్రజలు రాబోయే ఎన్నికలలో అనిల్ కుమార్ను తీసి పక్కన పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.
'నిన్నటి నీ అహంకార సమావేశం పొలిటికల్ కెరీర్ సూసైడ్లా ఉంది. అహంకార సభ, నీ సొంత డబ్బా సభకు నెల్లూరు సిటీ సెంటర్లో ఎలా పర్మిషన్ ఇచ్చారు. దీని వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. నీ సొంత డబ్బా ఏదైనా గ్రౌండ్లో ఏ ఫంక్షన్ హాల్లో పెట్టుకోవచ్చుగా.. మంత్రిగా ఉన్నప్పుడే నువ్వు నెల్లూరుకి చేసింది ఏమీలేదు గాని మాజీ మంత్రి అయిన తరువాత ఇప్పుడు చేస్తాను చూడండి.. అంటే నమ్మటానికి ప్రజలు ఏం అమాయకులు కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డికి పోటీగా సభ పెట్టి కనీసం ఒక్కమాట కూడా కాకానిని అనే ధైర్యం లేకపోయిందని ప్రజలందరూ భావిస్తున్నారు. అనిల్ నువ్వు నెల్లూరు ప్రజలకు చేసింది నిల్..' అని చెన్నారెడ్డి మనుక్రాంత్ అన్నారు.
అనిల్ అహంకార సభ కాకాని విజయోత్సవ సభ రెండూ ప్రజలకు దేనికి ఉపయోగపడని సభలేనని ఆయన అన్నారు. ఈ వైఎస్సార్సీపీ బాదుడే బాదుడు పాలనలో ప్రజలు పూర్తిగా వ్యతిరేకత ఉందని.. వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న ఒక్కమాటకు వైఎస్సార్సీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. మళ్లీ తానే మంత్రినవుతానని అనిల్ కుమార్ యాదవ్ అహంకారంగా మాట్లాడుతున్నారని.. నెల్లూరు ప్రజలకు ఏమి ఉపయోగం చెప్పాలన్నారు. నెల్లూరు ప్రజలు రాబోయే ఎన్నికలలో అనిల్ కుమార్ను తీసి పక్కన పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.