ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ.. ఇండియా వైడ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బేస్డ్గా తీసిన ఈ మూవీలో.. ఎర్రచందనం దుంగల్ని లారీలో ఎక్కించిన తర్వాత.. సరిగ్గా లోడ్ ఎత్తే సమయంలో కూలీలను, స్మగ్లర్లపై పోలీసులు అటాక్ చేస్తారు. ఆ టైంలో అల్లు అర్జున్ వీరోచితంగా లారీని దాచి సరుకును సేఫ్ చేస్తాడు. సరిగ్గా అలాంటి సీనే నెల్లూరు జిల్లాలోనూ చోటుచేసుకుంది. లోడ్ ఎత్తే సమయానికి పోలీసులు వస్తున్నారన్న సమాచారం అందడంతో ఎర్ర చందనం దుంగలతో పాటు 55 మంది తమిళనాడు కూలీలు, స్మగ్లర్లు పరారయ్యారు. అయితే పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి అందర్నీ అరెస్టు చేసి లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నారు.
నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన 55 మంది కూలీలతో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగల్ని నరికిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అటవీ ప్రాంతానికి బయల్దేరారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఎర్రచందనం స్మగ్లర్లు అడవిలో నుంచి పరారయ్యారు.
రెండు వాహనాల్లో చెన్నై వెళ్తుండగా సరిగ్గా గూడూరు సమీపంలోని బూదనం టోల్ప్లాజా వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎర్రచందనం కూలీల్ని పట్టుకునే సమయంలో కొందరు కూలీలు పోలీసులపై ఎదురు దాడికి పలువురు కానిస్టేబుల్స్కి గాయాలయ్యాయని ఎస్పీ విజయారావు తెలిపారు.
మొత్తం 55 మంది ఎర్రచందనం నరికే కూలీలు, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశామని ఎస్పీ విజయారావు తెలిపారు. రూ.36.13 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, లారీ, కారు, 31 సెల్ ఫోన్లు, రూ.75 వేల నగదు, గొడ్డళ్లు, బరికెలు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన దాము అనే స్మగ్లర్తో పాటు పళని, కుప్పన్ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశామని.. మరో ఇద్దరు కీలక నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశామని చేశామని తెలిపారు. కూలీలంతా పాండిచేరి, చెన్నైకి చెందిన వారేనని ఎస్పీ చెప్పారు. ఎర్రచందనం దుంగలను చైనా, జపాన్కు అక్రమంగా తరలించి డబ్బు సంపాదించాలనేదే స్మగర్ల వ్యూహ్యం అని ఎస్పీ బట్టబయలు చేశారు.
నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన 55 మంది కూలీలతో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగల్ని నరికిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అటవీ ప్రాంతానికి బయల్దేరారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఎర్రచందనం స్మగ్లర్లు అడవిలో నుంచి పరారయ్యారు.
రెండు వాహనాల్లో చెన్నై వెళ్తుండగా సరిగ్గా గూడూరు సమీపంలోని బూదనం టోల్ప్లాజా వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎర్రచందనం కూలీల్ని పట్టుకునే సమయంలో కొందరు కూలీలు పోలీసులపై ఎదురు దాడికి పలువురు కానిస్టేబుల్స్కి గాయాలయ్యాయని ఎస్పీ విజయారావు తెలిపారు.
మొత్తం 55 మంది ఎర్రచందనం నరికే కూలీలు, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశామని ఎస్పీ విజయారావు తెలిపారు. రూ.36.13 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, లారీ, కారు, 31 సెల్ ఫోన్లు, రూ.75 వేల నగదు, గొడ్డళ్లు, బరికెలు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన దాము అనే స్మగ్లర్తో పాటు పళని, కుప్పన్ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశామని.. మరో ఇద్దరు కీలక నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశామని చేశామని తెలిపారు. కూలీలంతా పాండిచేరి, చెన్నైకి చెందిన వారేనని ఎస్పీ చెప్పారు. ఎర్రచందనం దుంగలను చైనా, జపాన్కు అక్రమంగా తరలించి డబ్బు సంపాదించాలనేదే స్మగర్ల వ్యూహ్యం అని ఎస్పీ బట్టబయలు చేశారు.