బిక్షాటన చేస్తూ రోడ్డుపై జీవించే వృద్ధ జంట వద్ద ఉన్న తొమ్మిది నెలల పసిపాపను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన ఘటన నెల్లూరు నగరంలో కలకలం రేగింది. అయితే ఆ కేసును 24 గంటల్లోపే ఛేదించి పాపను సురక్షితంగా కాపాడారు పోలీసులు. తమ మనవరాలిని క్షేమంగా అప్పగించిన పోలీసులకు అవ్వాతాత కృతజ్ఞతలు తెలిపారు. పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఒక వృద్ధ జంట నెల్లూరు నగరంలో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. అయితే తమ కూతురు మరణంతో ఒంటరైన తొమ్మిది నెలల పసిపాపను తమతో పాటే తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. ప్రతీ రోజూ బిక్షాటన చేసి రాత్రి పూట సంతపేట పరిధిలోని గుప్తా నగర్లో నిద్రిస్తుండేవారు.
అయితే.. గూడూరుకు చెందిన మల్లి చెంచయ్య అనే వ్యక్తి.. నెల్లూరులో ఆటో నడుపుతూ చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ముసలి దంపతుల వద్ద ఉన్న తొమ్మిది నెలల ఆడపిల్లను చూసి ఎలాగైన కిడ్నాప్ చేయాలనుకున్నాడు. దీంతో వృద్ధ దంపతులు ఎక్కడ బిక్షాటన చేసేది.. నైట్ ఏ టైంలో పడుకునేది పూర్తిగా రెక్కీ నిర్వహించాడు. రాత్రి పార్క్ సమీపంలో అందరూ పడుకోగానే.. ఆటో నడుపుతున్నట్లు వచ్చి.. ఆటోను దూరంగా ఆపి, పసిపాపను కిడ్నాప్ చేశాడు.
తమ మనవరాలిని కిడ్నాప్ చేశారని బాధితులు సంతపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. వెంటనే రెస్పాండ్ అయిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తిరుపతిలో నిందితుడు చెంచయ్యను అరెస్టు చేశారు. శ్రీకాళహస్తిలో విక్రయించిన పసిపాపను తీసుకొచ్చి అవ్వతాతలకు అప్పగించారు. నిందితుడు మల్లి చెంచయ్య గతంలో మనుబోలులో ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని.. అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ విజయరావు తెలిపారు.
అయితే.. గూడూరుకు చెందిన మల్లి చెంచయ్య అనే వ్యక్తి.. నెల్లూరులో ఆటో నడుపుతూ చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ముసలి దంపతుల వద్ద ఉన్న తొమ్మిది నెలల ఆడపిల్లను చూసి ఎలాగైన కిడ్నాప్ చేయాలనుకున్నాడు. దీంతో వృద్ధ దంపతులు ఎక్కడ బిక్షాటన చేసేది.. నైట్ ఏ టైంలో పడుకునేది పూర్తిగా రెక్కీ నిర్వహించాడు. రాత్రి పార్క్ సమీపంలో అందరూ పడుకోగానే.. ఆటో నడుపుతున్నట్లు వచ్చి.. ఆటోను దూరంగా ఆపి, పసిపాపను కిడ్నాప్ చేశాడు.
తమ మనవరాలిని కిడ్నాప్ చేశారని బాధితులు సంతపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. వెంటనే రెస్పాండ్ అయిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తిరుపతిలో నిందితుడు చెంచయ్యను అరెస్టు చేశారు. శ్రీకాళహస్తిలో విక్రయించిన పసిపాపను తీసుకొచ్చి అవ్వతాతలకు అప్పగించారు. నిందితుడు మల్లి చెంచయ్య గతంలో మనుబోలులో ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని.. అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ విజయరావు తెలిపారు.