నాలుగు రోజుల కిందట నెల్లూరులో జరిగిన జంటహత్యల కేసును పోలీసులు చేధించారు. హతుడు కృష్ణారావు హోటల్లో సప్లయిర్ గా పనిచేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. యజమాని అందరిముందూ తనను మందలించాడన్న కక్షతోనే అంతం చేసినట్టు తెలిసింది. జంట హత్యల కేసు నిందితులను మీడియా ముందు పోలీసులు పోలీసులు ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు మాట్లాడుతూ.. ఆగస్టు 28న కృష్ణారావు, సునీత దంపతులు దారుణ హత్యకు గురయ్యారని తెలిపారు. హతుడు కృష్ణారావు శ్రీరామ క్యాంటీన్ నడుపుతున్నాడని, క్యాంటీన్లో పనిచేస్తున్న శివ.. రామకృష్ణ అనే మరో యువకుడితో కలిసి హత్యచేశారని వివరించారు. కేసు విచారణ కోసం మొత్తం ఐదు బృందాలు పనిచేశాయని ఎస్పీ పేర్కొన్నారు. పథకం ప్రకారం హత్యలు చేశారని తెలిపారు. ‘‘కృష్ణారావు ఇంటి వద్దకు వచ్చే లోపే హంతకులు అక్కడ నక్కి ఉన్నారు.. తలుపు తీసే సమయంలో కృష్ణారావు తలపై బలంగా కొట్టారు.. తర్వాత గొంతు కోసి హత్య చేశారు. అనంతరం లోపల నిద్రిస్తున్న సునీతను హత్య చేసి.. రూ.1.60 లక్షల నగదు దోచుకెళ్లారు.. అందరి ముందూ యజమాని మందలించారన్న కారణంగానే హత్యకు పాల్పడ్డారని, విచారణ జరుగుతున్న సమయంలో హంతకులు ఇద్దరూ అక్కడే ఉండి అంతా గమనిస్తూ ఉన్నారు.. దంపతుల అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు’ అని ఎస్పీ చెప్పారు. నిందితులు శివ, రామకృష్ణలపై 15 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో ఉన్న ఏఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో కృష్ణారావు, అతని భార్య నివాసం ఉంటున్నారు. అక్కడే క్యాంటిన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. భార్యాభర్తలను అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యలను సవాల్గా తీసుకున్న పోలీసులు.. ఐదు రోజుల్లోనే చేధించారు.
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఇందుగపల్లి గ్రామానికి చెందిన వాసిరెడ్డి కృష్ణారావు (54), సునీత (50) దంపతులు. వీరికి సాయిచంద్, గోపీచంద్ పిల్లలున్నారు. ఈ కుటుంబం 26 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికొచ్చారు. కరెంటాఫీస్ సెంటర్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటూ అదే ప్రాంతంలో శ్రీరామ్ క్యాంటీన్ను ప్రారంభించారు. వారి పెద్ద కుమారుడు సాయిచంద్ పోస్టల్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు గోపీచంద్ రాంజీనగర్లో నివాసముంటూ పొగతోటలో మధుర హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరూ స్థిరపడటంతో వివాహాలు జరిపించారు.
శనివారం అర్ధరాత్రి ఈ హత్యలు జరిగినా ఆదివారం ఉదయం పాలుపోసే మహిళ వచ్చే వరకూ వీధిలో వారికి తెలియలేదు.
నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో ఉన్న ఏఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో కృష్ణారావు, అతని భార్య నివాసం ఉంటున్నారు. అక్కడే క్యాంటిన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. భార్యాభర్తలను అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యలను సవాల్గా తీసుకున్న పోలీసులు.. ఐదు రోజుల్లోనే చేధించారు.
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఇందుగపల్లి గ్రామానికి చెందిన వాసిరెడ్డి కృష్ణారావు (54), సునీత (50) దంపతులు. వీరికి సాయిచంద్, గోపీచంద్ పిల్లలున్నారు. ఈ కుటుంబం 26 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికొచ్చారు. కరెంటాఫీస్ సెంటర్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటూ అదే ప్రాంతంలో శ్రీరామ్ క్యాంటీన్ను ప్రారంభించారు. వారి పెద్ద కుమారుడు సాయిచంద్ పోస్టల్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు గోపీచంద్ రాంజీనగర్లో నివాసముంటూ పొగతోటలో మధుర హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరూ స్థిరపడటంతో వివాహాలు జరిపించారు.
శనివారం అర్ధరాత్రి ఈ హత్యలు జరిగినా ఆదివారం ఉదయం పాలుపోసే మహిళ వచ్చే వరకూ వీధిలో వారికి తెలియలేదు.