యాప్నగరం

Nellore Rural Mla: మురికి కాలువలో దిగి వైసీపీ ఎమ్మెల్యే నిరసన.. ఒక్క హామీ కోసం!

Nellore Rural Mla మురికి కాలువలోకి దిగి నిరసన చేపట్టారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాగే మురికి కాలువలోకి దిగి నిరసన చేసిన ఎమ్మెల్యే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 5 Jul 2022, 2:30 pm

ప్రధానాంశాలు:

  • నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నిరసన
  • మురికి కాలువలో దిగిన కోటంరెడ్డి
  • అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (Nellore Rural Mla ) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy)మరోసారి వినూత్నంగా నిరసన తెలియజేశారు. నెల్లూరు పరిధిలోని ఉమ్మారెడ్డిగుంటలో ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన చేపట్టారు. మురికి కాలువలో దిగి ఆందోళనకు దిగారు.. కొన్నాళ్లుగా ఉమ్మారెడ్డిగుంటలో మురికికాల్వ సమస్య ఉందన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారుల తీరు బాగోలేదని.. లిఖితపూర్వక హమీ ఇచ్చి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.రైల్వే, నగర కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానని.. ఎప్పటిలోపు పనుల ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతవరకు కాల్వ దగ్గర నుంచి కదలబోనని అక్కడే కూర్చున్నారు. ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే మురుగునీటిలోనే పడుకుంటానని హెచ్చరించారు. వెంటనే అధికారులు ఈనెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి.. వచ్చే నెల 15లోపు పూర్తిచేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో శ్రీధర్ రెడ్డి తన ఆందోళనను విరమించారు.
టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇదే మురికి కాలువలోకి దిగారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక..కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని 31వ డివిజన్‌ చాణక్యపురి వద్ద ఉన్న వరద కాలువపై బ్రిడ్జి నిర్మించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కాలువపై బ్రిడ్జి నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గంట పాటు మురుగు కాలువలోనే నిల్చోగా.. చివరకు అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మరోసారి ఇప్పుడు కాలువలోకి దిగారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.