యాప్నగరం

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు

Rajdhani Express: చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో బీ-5 బోగీలో నుంచి పొగలు వచ్చాయి. బ్రేకులు ఫెయిల్ కావటంతో పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 9 Apr 2023, 1:59 pm

ప్రధానాంశాలు:

  • రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
  • నెల్లూరు జిల్లా కావలి వద్ద ఘటన
  • బ్రేకులు ఫెయిల్ కావటంతో పొగలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rajdhani Express
రాజదాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
Rajdhani Express: నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడం కలకలం రేపింది. చెన్నై నుంచి ఢిల్లీ హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఉన్నట్లుండి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బీ-5 బోగీలో నుంచి పొగలు రావటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రయాణికులు భయాబ్రాంతులకు గురయ్యారు. రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
పొగలు రావటానికి కారణాలు గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ కావటంతోనే పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీంతో కావలి రైల్వే స్టేషన్‌లోనే రాజధాని ఎక్స్‌ప్రెస్ సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. అయితే ఈ ఘటనతో ఎలాంటి ఇబ్బంది లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అక్కడి నుంచి బయల్దేరింది.

రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.