యాప్నగరం

తండ్రి లాంటోడే చెరబట్టాడు.. బాలికకు ఆర్నెల్లుగా నరకం

అధికారుల విచారణలో నిందితుడు ఆ బాలికతో పాటు ఇంటి సమీపంలోని చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తేలింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు

Samayam Telugu 21 Jul 2021, 8:13 am
తండ్రి లాంటి వాడు.. ఆమె జీవితానికి అండగా ఉండి దారి చూపాల్సిన వాడు. కానీ వాడే కామాంధుడిగా మారి కన్నకూతురి లాంటి 14ఏళ్ల బాలికను చెరబట్టి ఆర్నెల్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. మానవత్వానికి మచ్చతెచ్చే సంఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
Samayam Telugu Image


Also Read: గుంటూరు జిల్లాలో దారుణం.. 7 నెలల పసిపాపపై పైశాచికం.. మర్మావయాలపై గాయాలు

వెంకటగిరికి చెందిన ఓ మహిళ భర్త కొన్నేళ్ల కిందట చనిపోయారు. దాంతో ఆమె సమీప బంధువుతో సహజీవనం సాగిస్తోంది. తన ఇద్దరు పిల్లలకు ఆ వ్యక్తే తండ్రిగా అందరినీ నమ్మించింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఆమె కుమార్తె(14)పై అతడు కన్నేశాడు. భయపెట్టి ఆమెను లొంగదీసుకొని ఆరు నెలలుగా నరకం చూపించాడు. తల్లిలేని సమయం చూసి బాలికపై తరచూ అత్యాచారం చేస్తున్నాడు. అయితే బాధితురాలు భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేక గుండెలవిసేలా రోదించేది. ధైర్యం చేసి తల్లికి ఈ విషయం చెప్పినా ఆమె పట్టనట్లు వ్యవహరించడంతో బాలిక పరిస్థితి దయనీయంగా మారింది.

అయితే ఓ రోజు బాలికపై లైంగిక దాడికి పాల్పడుతుండగా ఆమె తమ్ముడు చూసి వార్డు సచివాలయంలోని మహిళా కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాడు. అధికారుల విచారణలో నిందితుడు ఆ బాలికతో పాటు ఇంటి సమీపంలోని చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తేలింది. ఐసీడీఎస్‌ అధికారిణి జ్యోతి, సూపర్‌వైజర్‌ ఉమామహేశ్వరి, సచివాలయ పోలీసు మునీశ్వరి పూర్తిస్థాయిలో విచారించిన అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ విషయమై వెంకటగిరి ఎస్ఐ వెంకట రాజేష్‌ స్పందిస్తూ.. తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నట్లు బాలిక చెప్పిందని, పూర్తిస్థాయిలో విచారించి కేసు నమోదు చేశామన్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.