యాప్నగరం

నెల్లూరులో 20 కిలోల బంగారంతో వ్యాపారి పరారీ.. నమ్మకంగా ఉంటూ ముంచేశాడు

Nellore 20 Kgs Gold Absconded కలకలంరేపుతోంది. వ్యాపారి అందరితో స్నేహంగా ఉన్నట్లు నటించి 20 కేజీల బంగారంతో పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 14 Feb 2023, 1:26 pm

ప్రధానాంశాలు:

  • నెల్లూరులో వ్యాపారి భారీ మోసం
  • 20 కేజీల బంగారంతో పరారీ
  • పోలీసులకు బాధితుల ఫిర్యాదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nellore 20 Kgs Gold Cheating
నెల్లూరులో వ్యాపారి బంగారంతో పరారీ అయ్యాడు. ఏకంగా 20 కేజీల బంగారంతో ఉడాయించాడు.. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. నెల్లూరు చిన్నబజారుకి చెందిన కిరణ్ అనే వ్యక్తి.. బంగారం వ్యాపారులను నమ్మించి మోసం. ఏకంగా 20 కిలోలకు పైగా బంగారు తీసుకుని.. కుటుంబంతో సహా కనిపించకుండా మాయమయ్యాడు. చివరికి కిరణ్ చేతిలో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సంతపేట, నవాబుపేట పీఎస్‌లలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిరణ్ కోసం గాలింపు మొదలు పెట్టారు. అందరితో మంచిగా ఉండేవాడని.. ఇలా నమ్మించి బంగారంతో పారిపోతాడని తాము అనుకోలేదంటున్నారు బాధితులు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.