యాప్నగరం

నా కోరిక తీరిపోయింది, ఆయన వల్లే బీజేపీ ఇలా.. నెల్లూరులో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ప్రశంసల వర్షం కురిపించారు.

Samayam Telugu 14 Nov 2021, 3:50 pm
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వస్థలంలో నిలబడి ఆయన గురించి మాట్లాడాలన్న తన అభిలాష ఇన్నాళ్లకు నెరవేరిందని అమిత్‌ షా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం వెంకటాచలంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు చెందిన స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరయ్యారు.
Samayam Telugu అమిత్ షా



ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పెరగడానికి వెంకయ్యనాయుడే ముఖ్య కారణమని వెల్లడించారు. క్రమశిక్షణకు వెంకయ్య మారుపేరన్నారు. వెంకయ్య నాయుడు విద్యార్థి స్థాయి నుంచే నాయకుడిగా ఎదిగారని.. ‘లోక్‌నాయక్’ జయప్రకాష్ నారాయణ్ స్ఫూర్తితో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నో ఉన్నతస్థాయి చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారని పేర్కొన్నారు.

బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారని.. రైతులకు ఏదో ఒకటి చేయాలని ఆయన ఎప్పుడూ పరితపిస్తుంటారని తెలిపారు. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో కేంద్రమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారని అమిత్‌షా కొనియాడారు. కేంద్రమంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు వన్నె తెచ్చారని అమిత్‌ షా కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.