యాప్నగరం

పాటలు వింటూనే రైలు పట్టాలపైకి.. సడెన్‌గా ట్రైన్ రావడంతో..

నెల్లూరు జిల్లాలో రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఇయర్ ఫోన్స్‌లో పాటలు వింటూ.. రైలు పట్టాలు దాటుతునన్నాడు. ఈ క్రమంలో సడెన్‌గా ట్రైన్ వచ్చి అతడిని ఢీకొట్టింది.

Samayam Telugu 4 Jan 2022, 8:37 am
నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇయర్ ఫోన్స్‌లో పాటలు వింటూ.. ఓ యువకుడు రైలు పట్టాలు దాటుతున్నాడు. పాటల ధ్యాసలో పడిన అతను.. అటు వైపు నుంచి వస్తున్న ట్రైన్‌ను గమనించలేదు. దీంతో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పూర్తి వివరాలు ఇలా.. నెల్లూరు నగరంలోని కొండాయపాలెం వద్ద ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గౌతమ్ కృష్ణ (25) అనే యువకుడు ఉంటున్నాడు. అతను నగరంలోని కిమ్స్ కిమ్స్ ఆసుపత్రిలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి హాస్టల్ వద్ద నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉమ్మారెడ్డిగుంటకు నడుచుకుంటూ బయలుదేరాడు.

ఈ క్రమంలో కొండాయ పాలెం గేటు వద్ద రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. గౌతమ్ కృష్ణ రైలు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొంది. దీంతో అతడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.