యాప్నగరం

ఇంట్రెస్టింగ్ సీన్.. అమరాతి రైతులను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే

Amaravati రైతులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిశారు. వారికి సంఘీభావం తెలిపి.. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని ఆయన అన్నారు. రైతులకు తప్పకుండా సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Samayam Telugu 29 Nov 2021, 11:18 am

ప్రధానాంశాలు:

  • అమరాతి రైతులను కలిసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • జై అమరావతి అనాలని కోరిన రైతులు
  • సున్నితంగా తిరస్కరించిన ఎమ్మెల్యే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు అమరాతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాడ్ చేస్తూ.. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరాతి రైతులు పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం రైతుల పాదయాత్ర నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. ఈ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానికులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్ర చేసే వారిపై పూల వర్షం కురిపిస్తూ.. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో అమరాతి రైతులను వైఎస్సార్సీపీ చెందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కలిశారు. వారికి సంఘీభావం తెలిపి.. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని ఆయన అన్నారు. రైతులకు తప్పకుండా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో మాట్లాడిన అమరావతి రైతులు.. జై అమరావతి అనాలని ఆయనను కోరారు. వారి ప్రతిపాదననను ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా అనేందుకు తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ రైతులకు నచ్చజెప్పారు. ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకే కట్టుబడి ఉండగా.. అమరాతి రైతుల పాదయాత్రకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సంఘీభావం తెలపడం హాట్ టాపిక్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.