యాప్నగరం

తూ.గో: కొంపముంచిన యువనేత బర్త్ డే సెలబ్రేషన్స్.. 10మందికి కరోనా

వేడుకలకు వెళ్లినవారంతో పరీక్షలు చేయించుకున్నారట.. వారిలో పదిమందికి వైరస్ సోకినట్లు తేలింది. పార్టీకి చెందిన యువనేత పుట్టిన రోజు వేడుకల్లో పలువురు కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా పొల్గొన్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 20 Jul 2020, 2:07 pm
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నాలుగు రోజులుగా 500కుపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల ఓ యువనాయకుడి బర్త్ డే వేడుక దెబ్బకు పదిమంది వైరస్ బారినపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెంకు చెందిన ఓ యువనేత బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు స్థానిక కార్యకర్తలు హాజరయ్యారు. అందరూ కలిసి పార్టీ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu 10 members tests coronavirus positive after participated in youth leader birthday party at east godavari district
తూ.గో: కొంపముంచిన యువనేత బర్త్ డే సెలబ్రేషన్స్.. 10మందికి కరోనా


ఈ వేడుకల తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో కొందరు టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్ తేలింది. ఆ వెంటనే ఈ వేడుకలకు వెళ్లినవారంతో పరీక్షలు చేయించుకున్నారట.. వారిలో పదిమందికి వైరస్ సోకినట్లు తేలింది. పార్టీకి చెందిన యువనేత పుట్టిన రోజు వేడుకల్లో పలువురు కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా పొల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సెలబ్రేషన్స్‌కు వెళ్లినవారిలో కలవరం మొదలైంది.

ర్యాపిడ్ టెస్టు కిట్స్ తీసుకొచ్చి వేడుకల్లో పాల్గొన్న అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారట. అయితే ఊబలంక నుండి కొందరు తిరుమలకి పాదయాత్రగా వెళ్లారు. వారికి దర్శనం చేయించేందుకు ఒక నేత అక్కడకి వెళ్లి వచ్చారు. వచ్చాక ఈ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత ఆయనకు ఆయన గన్ మెన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు నేత ద్వారానే ఈ కరోనా సోకినట్టు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.