యాప్నగరం

Andhra Pradesh Coronavirus: ఏపీ కరోనా అలర్ట్.. మరో 15 పాజిటివ్, మొత్తం 329 కేసులు

ఏపీలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. తాజాగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణాజిల్లాలో 6, చిత్తూరులో 3 కేసు లు నమోదయ్యాయి. మొత్తం కేసులు 329 నమోదయ్యాయి.

Samayam Telugu 9 Apr 2020, 10:17 am
ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. బుధవారం మళ్లీ పెరిగాయి. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి.. బుధవారం ఉదయం 10 గంటల వరకునమోదైన కోవిడ్19 పరీక్షల్లో.. మరో 15 నమోదయ్యాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరులో 3 కేసు లు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కు పెరిగింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరుగురకి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.
Samayam Telugu ap.


Don't Miss: ఆ డాక్టర్‌కు ఎంత బలుపు.. ఏపీ మంత్రి ఫైర్

Read Also: మేడిన్ ఏపీ: 55 నిమిషాల్లోనే కరోనా టెస్ట్.. మెడ్‌టెక్ ఘనత

రాష్ట్రంలో కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.

Also Read: ఏపీ గవర్నర్ మంచి మనసు.. ఏడాది పాటూ జీతంలో!

జిల్లాలవారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలు జిల్లా - 74
నెల్లూరు జిల్లా - 49
గుంటూరు జిల్లా - 41
కృష్ణా జిల్లా -35
కడప జిల్లా - 28
ప్రకాశం జిల్లా - 24
పశ్చిమ గోదావరి జిల్లా - 21
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా - 20
తూర్పుగోదావరి జిల్లా - 11
అనంతపురం జిల్లా -6
మొత్తం కేసులు - 329
(గమనిక: ఈ మొత్త కరోనా పాజిటివ్ కేసుల్లో ఆరుగురు ట్రీట్మెంట్ తర్వాత నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.