ఏపీలో కరోనా విస్తరిస్తోంది. టెస్టులు చేస్తున్న కొద్ది కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఏకంగా 208 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే నగరిలో ఒకే కుటుంబంలో 22 కేసులు తేలడం కలకలంరేపింది. కాంటాక్ట్లపై ఆరా తీస్తే ఒకరి వల్ల మిగిలిన 21మందికి వైరస్ సోకినట్లు తేలింది.
ఓ వ్యక్తి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అనారోగ్యంతో వెళ్లారు.. ఆయనకు 84 ఏళ్లు. పెద్దాయన అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. ఉమ్మడి కుటుంబం కావడంతో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. నలుగురు కుమారులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు నగరిలో ఉంటున్నారు. వారం క్రితం ఆయన భార్య చనిపోయారు. అంత్యక్రియలకు తమిళనాడు నుంచి బంధువులు వచ్చారు. మూడు రోజుల క్రితం ఆయన కుమారుడు కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లారు.
ఆ కుటుంబసభ్యులు అందరికి పరీక్షలు నిర్వహించగా.. ఆ ఫ్యామిలీలో 16 మందికి, పక్కింట్లో ఉన్న ఆయన తమ్ముడి కుటుంబంలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే అదే వీధిలో ఉన్న ఒక వైద్యుడితో పాటు ఆయన ఇంట్లో ఉన్న ఐదుగురికి 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వీధిలో 30మందికిపైగా వైరస్ సోకింది.
ఓ వ్యక్తి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అనారోగ్యంతో వెళ్లారు.. ఆయనకు 84 ఏళ్లు. పెద్దాయన అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. ఉమ్మడి కుటుంబం కావడంతో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. నలుగురు కుమారులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు నగరిలో ఉంటున్నారు. వారం క్రితం ఆయన భార్య చనిపోయారు. అంత్యక్రియలకు తమిళనాడు నుంచి బంధువులు వచ్చారు. మూడు రోజుల క్రితం ఆయన కుమారుడు కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లారు.
ఆ కుటుంబసభ్యులు అందరికి పరీక్షలు నిర్వహించగా.. ఆ ఫ్యామిలీలో 16 మందికి, పక్కింట్లో ఉన్న ఆయన తమ్ముడి కుటుంబంలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే అదే వీధిలో ఉన్న ఒక వైద్యుడితో పాటు ఆయన ఇంట్లో ఉన్న ఐదుగురికి 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వీధిలో 30మందికిపైగా వైరస్ సోకింది.