యాప్నగరం

తూర్పు గోదావరిలో మరో 5 కరోనా కేసులు, ఒక్కరి ద్వారా..

East Godavari Coronavirus: తూర్పు గోదావరి జిల్లాలో మరో ఐదు కరోనా కేసులు పెరిగాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 17కు చేరుకుంది.

Samayam Telugu 6 Dec 2022, 5:24 pm
తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం ఒక్క రోజే మరో ఐదుగురికి కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 17కి చేరింది. జిల్లాలోని కత్తిపూడిలో ఈ 5 కేసులు నమోదైనట్లు పెద్దాపురం ఆర్డీవో మల్లిబాబు ప్రకటించారు. కరోనా వైరస్‌ నిర్ధారణ అయిన ఐదుగురిని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు.
Samayam Telugu Corona Cases


తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్‌ శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ఇటీవలే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ వ్యక్తితో సంబంధం ఉన్న 30 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఐదుగురికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆర్డీవో వెల్లడించారు.

ఒక్కసారిగా ఐదు కొత్త కేసులు నమోదు కావడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆర్డీవో ప్రజలకు సూచించారు. అంతేకాకుండా కత్తిపూడి, పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఆరోగ్య శాఖ సిబ్బందికి తెలియజేయాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.