యాప్నగరం

విశాఖ: కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థత

వీరంతా చనిపోయిన ఆవు మాంసం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు చెబుతున్నారు. ఒక్కసారిగా ఇంతమంది అస్వస్థతకు గురికావడం కలకలంరేపింది.

Samayam Telugu 9 Jul 2020, 9:41 am
విశాఖ మన్యంలో కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మలకపాలెంలో స్థానికులు విషాహారం తిన్నారు. వెంటనే వీరంతా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందర్ని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే చనిపోయిన ఆవు మాంసం తినడం వల్లే అనారోగ్యం పాలయ్యారని డాక్టర్లు చెబుతున్నారు. ఒక్కసారిగా ఇంతమంది అస్వస్థతకు గురికావడం కలకలంరేపింది. విషయం తెలిసిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Samayam Telugu విశాఖ ఫుడ్ పాయిజన్


మన్యంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. విషాహారం తినడంతో గిరిజనులు కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో.. ఆహారం విషయంలో గిరిజనులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.