యాప్నగరం

కరోనాతో ఆంధ్రా మహిళ మృతి.. చికిత్స పొందుతూ కర్ణాటకలో మరణం

Hindupur Woman dies of Coronavirus | కరోనా వైరస్‌తో ఏపీకి చెందిన మహిళ కర్ణాటకలో మరణించారు. ఆమె వయసు 75 ఏళ్లు. ఇటీవలే ఆమె మక్కా వెళ్లి వచ్చారు.

Samayam Telugu 26 Mar 2020, 2:49 pm
కర్ణాటకలో రెండో కరోనా మరణం చోటు చేసుకుంది. బుధవారం కరోనా లక్షణాలతో చనిపోయిన 75 ఏళ్ల వృద్ధురాలి శాంపిళ్లను పరీక్షించగా... ఆమెకు కోవిడ్ సోకినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని వైద్య విద్య శాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. చనిపోయిన వృద్ధురాలిది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం అని తెలుస్తోంది. ఇటీవలే మక్కా వెళ్లి వచ్చిన ఆమె అనారోగ్యం బారిన పడటంతో పొరుగునే కర్ణాటకలో ఉన్న చిక్కబళ్లాపురంలోని జిల్లా హాస్పిటల్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో బెంగళూరు తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు వదిలింది.
Samayam Telugu corona death


కరోనా మరణించిన మహిళ విషయాన్ని ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు ప్రస్తావిస్తూ.. ఆమె డయాబెటిస్, ఛాతి నొప్పి కారణంగా బాధపడిందని.. ఇటీవలే తుంటి కూడా విరిగిందన్నారు. బుధవారం నాటికి కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 51కి చేరింది. ఒక్క బెంగళూరులోనే 32 కేసులు నమోదు కాగా.. 24 గంటల వ్యవధిలో 10 మందికి పాజిటివ్ అని నిర్ధారించారు.

కర్ణాటకలో తొలి కరోనా మరణం మార్చి 10న సంభవించిన సంగతి తెలిసిందే. కలబుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా చనిపోయాడు. ఆయన కూడా మక్కా వెళ్లొచ్చారు. ఆయన హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లోనూ చికిత్స పొందారు. దేశంలో నమోదైన తొలి కరోనా మరణం ఇది అనే సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.