యాప్నగరం

టీటీడీలో కరోనా కలకలం.. ఏకంగా 80మంది సిబ్బందికి పాజిటివ్

రోజూ 200మంది టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహణ.. భక్తుల ద్వారా ఉద్యోగులకు వైరస్ సోకిన్టలు ఆధారాలు లేవు. ఇప్పటి వరకు 800మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది.

Samayam Telugu 9 Jul 2020, 7:32 am
టీటీడీలో కరోనా కలకలంరేపుతోంది. ఏకంగా 80మంది సిబ్బందికి వైరస్ నిర్థారణ అయినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. దీని గురించి కంగారుపడాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రోజూ 200మంది టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని.. భక్తుల ద్వారా ఉద్యోగులకు వైరస్ సోకిన్టలు ఆధారాలు లేవు అంటున్నారు. ఇప్పటి వరకు 800మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది అన్నారు.
Samayam Telugu టీటీడీ


టీటీడీ సిబ్బందికి కరోనా సోకడంపై పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఉద్యోగుల్లో పాలకమండలి మనోధైర్యం నింపుతోందన్నారు. ఉద్యోగుల భద్రతపై చర్చించడానికి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ బాధ్యతను ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో, ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డికు అప్పగించారు. ఇక తిరుమలకు వచ్చే ప్రతి ఉద్యోగికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తామన్నారు సుబ్బారెడ్డి.ఈ నెలాఖరు వరకు భక్తుల సంఖ్యను పెంచబోమన్నారు. ఇప్పటి వరకూ ఒక్క భక్తుడికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అత్యవసర పాలకమండలి సమావేశం నిర్వహించామని క్లారిటీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.