యాప్నగరం

ఏపీ: ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఎఫెక్ట్.. పత్తికొండ తహశీల్దార్ ఏం చేశారో తెలుసా

Mro Vijaya Reddy: అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యతో ఆంధ్రప్రదేశ్‌లోనూ కలకలం. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మార్వో ఉమా మహేశ్వరి ముందస్తు జాగ్రత్త చర్యలు

Samayam Telugu 6 Nov 2019, 12:09 pm
అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆమెను ఏకంగా కార్యాలయంలోని తన గదిలోనే పెట్రోల్ పోసి తగులబెట్టడంతో రెవెన్యూశాఖలో అలజడి రేగింది. తెలంగాణలో మంగళవారం రెవెన్యూ సిబ్బంది విధులు బహిష్కరించి తమ నిరసనల్ని తెలియజేయగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రత గురించి చర్చ మొదలయ్యింది. తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు.
Samayam Telugu mro.


ఇటు ఏపీలో కూడా ఎమ్మార్వో విజయమారెడ్డి హత్య ఉదంతం కలకలంరేపింది. ఆమె హత్యను నిరసిస్తూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. విజయారెడ్డి హత్య తర్వాత భద్రతపై తహశీల్దార్‌లు ఆందోళనలో ఉన్నారు. తెలంగాణలో జరిగిన ఘటన పునరావృతమవుతాయనుకున్నారో ఏమో.. కర్నూలు జిల్లా పత్తికొండ తహశీల్దార్ ఉమామహేశ్వరి.. రెవెన్యూ కార్యాలయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎమ్మార్వో ఉమామహేశ్వరి తన చాంబర్‌ చుట్టూ తాడు కట్టించారు. స్థానిక ప్రజలు ఎవరైనా అర్జీలు ఇవ్వాలంటే.. తాడు బయట నుంచే ఇవ్వాలని చెప్పారు. లోపలికి ఎవర్నీ అనుమతించవద్దని సిబ్బందికి సూచించారు. ఎమ్మార్వో తాడు కట్టడంతో ఆఫీసుకు వచ్చిన జనాలు ఆశ్చర్యంగా చూశారు. చేసేదేమీ లేక తాడు బయట నుంచే తమ అర్జీలు ఇచ్చి సమస్యల్ని చెప్పుకున్నారు. ఈ తాడు వ్యవహారంపై స్పందించిన ఎమ్మార్వో ఉమా మహేశ్వరి.. జాగ్రత్తలు తప్పవు కదా అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.