యాప్నగరం

విజయనగరంలో అవినీతి చేపలు.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. రూ. 85 వేలు లంచం తీసుకుంటుండగా.. సీపీడీవో మణిమాల, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్‌లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Samayam Telugu 16 Dec 2019, 7:37 pm
విజయనగరం జిల్లాలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. రూ.85 వేలు లంచం తీసుకుంటుండగా.. చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పి.మణిమాల, కొత్తవలస ఐసీడీఎస్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తోన్న జీవీకే వేణుగోపాల్‌లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అడారి సురేశ్ కుమార్ అనే వ్యక్తి అంగన్‌వాడీ కేంద్రాలకు కూరగాయలు, సరుకులను సరఫరా చేస్తుంటారు. ఆయనకు నవంబర్ నెల బిల్లులు రావాల్సి ఉంది.
Samayam Telugu లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు


బిల్లులు క్లియర్ చేయడానికి, కాంట్రాక్టును పొడిగించడం కోసం సురేశ్ కుమార్ నుంచి ఈ ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రూ.85 వేల నగదును వేణుగోపాల్‌కు ఇవ్వగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి అధికారి చేతి వేళ్లకు కెమికల్ అంటుకున్నట్టు పరీక్షలో తేలింది. సదరు అధికారుల వద్ద నుంచి ఆ సొమ్మును రికవరీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.