ఏపీ: మాజీ మంత్రి పితాని కుమారుడి కోసం ఏసీబీ గాలింపు
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. అతడు హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి.. అక్కడికి స్పెషల్ టీమ్ను పంపించారు.
Samayam Telugu 11 Jul 2020, 10:17 am
ఏపీ ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. అతడు హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి.. అక్కడికి స్పెషల్ టీమ్ను పంపించారు. అతడి కోసం భాగ్యనగరంలో గాలింపు చేపట్టారు. పితాని మంత్రిగా ఉన్న సమయంలో సురేష్ కొన్ని కంపెనీలకు మందుల కొనుగోలు చేసేందుకు సిఫార్స్ చేసినట్లు ఏసీబీ విచారణలో తేలిందట.
అంతేకాదు శుక్రవారం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలో విధుల్లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేశారు. అంతకముందు పితాని కుమారుడు, మాజీ పీఎస్ మురళి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిసన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
ఏపీలో ఈఎస్ఐ స్కామ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ మెడికల్ ఇన్స్యూరెన్స్లో 2014-15 నుంచి 2018-19 వరకు జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసింది. పలు అవినీతి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా 988.77 కోట్ల విలువైన మందులు, రూ.150 కోట్లపైన వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ అక్రమాలలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకై ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లు తేల్చారు.
ఈ కేసులో ఇప్పటివరకు అచ్చెన్నాయుడు సహా తొమ్మిది మందిని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ అధికారులు పలువుర్ని కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని కుమారుడు, పీఎస్ పాత్ర ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు పీఎస్ను అరెస్ట్ చేయడం.. సురేష్ కోసం ఏసీబీ గాలించడంతో అది నిజమైంది.
అంతేకాదు శుక్రవారం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలో విధుల్లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేశారు. అంతకముందు పితాని కుమారుడు, మాజీ పీఎస్ మురళి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిసన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
ఏపీలో ఈఎస్ఐ స్కామ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ మెడికల్ ఇన్స్యూరెన్స్లో 2014-15 నుంచి 2018-19 వరకు జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసింది. పలు అవినీతి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా 988.77 కోట్ల విలువైన మందులు, రూ.150 కోట్లపైన వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ అక్రమాలలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకై ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లు తేల్చారు.
ఈ కేసులో ఇప్పటివరకు అచ్చెన్నాయుడు సహా తొమ్మిది మందిని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ అధికారులు పలువుర్ని కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని కుమారుడు, పీఎస్ పాత్ర ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు పీఎస్ను అరెస్ట్ చేయడం.. సురేష్ కోసం ఏసీబీ గాలించడంతో అది నిజమైంది.