యాప్నగరం

నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో ప్రమాదం.. ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

బాయిలర్ యూనిట్‌లో పైప్ లీక్ అవడంతో వేడినీళ్లు మీదపడి లక్ష్మణమూర్తి అనే ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడ్ని వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

Samayam Telugu 6 Aug 2020, 10:49 am
కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని బాయిలర్ యూనిట్‌లో పైప్ లీక్ అవడంతో వేడినీళ్లు మీదపడి లక్ష్మణమూర్తి అనే ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడ్ని వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ఎస్పీవై ఆగ్రో


గతంలో కూడా నంద్యాలలో ఎస్పీవై ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఒకరు చనిపోగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణ భయంతో స్థానికులు కూడా పరుగులు తీశారు. మళ్లీ ఎస్పీవై ఫ్యాక్టరీలోనే ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.