యాప్నగరం

విశాఖలో లేడీ అరాచకం.. మరో మహిళపై యాసిడ్ పోసి పరారీ..

విశాఖలో ఓ లేడీ అరాచకానికి పాల్పడింది. మహిళపై యాసిడ్ పోసం పరారైంది. బాధితురాలు హైదరాబాద్ నుంచి వచ్చిన గంటల వ్యవధిలోనే యాసిడ్ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Samayam Telugu 4 Dec 2019, 11:22 pm
విశాఖపట్నంలో దారుణ ఘటన జరిగింది. ఒక మహిళపై మరో మహిళ యాసిడ్‌తో దాడి చేయడం కలకలం రేపుతోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వివాహితపై గుర్తు తెలియని మహిళ యాసిడ్ పోసి పరారైంది. యాసిడ్ చల్లడంతో వివాహిత శరీరం ముప్పై శాతానికి పైగా కాలిపోయనట్లు తెలుస్తోంది. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu acid attack


హైదరాబాద్‌లో నివాసం ఉండే వివాహిత శిరీష ఈ రోజే విశాఖ వచ్చింది. నగరంలోని సమతానగర్‌లో శిరీష నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్‌తో దాడి చేసింది. ఒక్కసారిగా యాసిడ్ ఒంటిపై పోయడంతో శిరీషకు తీవ్రగాయాలయ్యాయి. సుమారు 30 శాతానికిపైగా కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను స్థానిక ఆర్కే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. ఇద్దరు మహిళలు దుర్మరణం

అయితే శిరీషపై యాసిడ్ దాడికి పాల్పడింది కూడా మహిళేనని తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితురాలి కోసం పోలీసులు వెతుకుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన గంటల వ్యవధిలోనే యాసిడ్ దాడి జరగడంపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని శిరీష కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరిపైన అయినా అనుమానం ఉందా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

Read Also: చిత్తూరులో కిడ్నాప్ కలకలం.. బాలికను బలవంతంగా కారులోకి లాగి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.