యాప్నగరం

సుగాలి ప్రీతి కేసు సీబీఐకి..! పవన్ పోరాటానికి మంచు మనోజ్ సపోర్ట్!

హీరో మంచు మనోజ్ ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ అని డిమాండ్ చేశారు. ఆమెను హత్య చేసిన వారిని సీబీఐ పట్టుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Samayam Telugu 12 Feb 2020, 11:55 am
జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి డిమాండ్ సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. కర్నూలులో పవన్ కళ్యాణ్ ర్యాలీ చేపట్టనుండటంతో.. సుగాలి ప్రీతి కేసు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అత్యాచారం, హత్యకు గురైన ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించామని కర్నూలు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసు వివరాలను కేంద్ర హోంశాఖకు పంపామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ర్యాలీకి ఒక్క రోజు ముందు ఎస్పీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
Samayam Telugu pawan manoj


కాగా ఈ కేసు విషయమై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. సుగాలి ప్రీతి హత్యకు కారణమైన వారిని సీబీఐ పట్టుకుంటుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. ఆమె కుటుంబానికి బలం చేకూరాలన్నారు. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే హ్యాష్ ట్యాగ్‌ను తన ట్వీట్‌కు మనోజ్ జత చేశారు.

కర్నూలుకు చెందిన 14 ఏళ్ల ప్రీతి బాలిక కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదివేది. ఇది టీడీపీ నేతకు చెందిన పాఠశాల. 2017 ఆగస్టు 19న ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని స్కూల్ యాజమాన్యం చెప్పింది. కానీ స్కూల్ అధినేత కొడుకులిద్దరూ అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. బాలికపై అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం రిపోర్టులోనూ వచ్చింది. కానీ ఇంత వరకూ దోషులను శిక్షించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.