యాప్నగరం

తిరుమలలో ప్రత్యక్షమైన పృథ్వీరాజ్.. చేతికి కట్టు కట్టుకుని..

ఎస్వీబీసీ మాజీ చైర్మన్, కమేడియన్ పృథ్వీరాజ్ ఆదివారం తిరుమల వచ్చారు. సోమవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Samayam Telugu 23 Feb 2020, 10:42 pm
ప్రముఖ సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆదివారం తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. నెల రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన పృథ్వీరాజ్ చాలా రోజుల తర్వాత మీడియాకు కనిపించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
Samayam Telugu pjimage (61)


Also Read: రూ. 2,300 కోట్ల వెంకన్న డబ్బు జగన్ సర్కార్‌ ట్రెజరీకి.. టీటీడీ క్లారిటీ

పృథ్వీరాజ్ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎంతో హుషారుగా ఉండే పృథ్వీరాజ్ ఈసారి బాగా ముభావంగా కనిపించారు. అలాగే చేతికి కట్టు కట్టుకుని తీరుమల వచ్చారు. ఈ సందర్భంగా మీడియా పలకరించగా మాట్లాడకుండా వెళ్లిపోయారు.

ఎస్వీబీసీలోని ఓ మహిళా ఉద్యోగితో సరస సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ వెలుగులోకి రావడంతో.. చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాను ఏ తప్పూ చేయలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గౌరవంతో తాను పదవికి రాజీనామా చేశానని అప్పట్లో పృథ్వీరాజ్ తెలిపారు. జూలై చివరి వారంలో శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పృథ్వీ ప్రస్థానం.. ఆరు నెలలైనా గడవక ముందే ఇలా అనూహ్యంగా ముగిసింది. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ సమయంలో పృథ్వీ తిరుమలలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది.

Also Read: వెనుక నుంచి పట్టుకుని.. ముద్దులు పెట్టి.. విస్తుగొలిపేలా బిషప్ అకృత్యాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.