అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఆడవాళ్లు పడే కష్టాలు, వారి త్యాగాలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఈ సమాజం కోసం మహిళలు పడే కష్టానికి వెలకట్టలేమంటూ కితాబిస్తున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.. మహిళలకు వరాల జల్లు కురిపించాయి. ఈ సంగతి అలా ఉంచితే.. ఉమెన్స్ డే సందర్భంగా సినీ నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిని ఆమె ఆకాశానికెత్తారు. ‘‘జీవితంలో నిరాశ పడిపోయే మనుషులను.. సహనం, ప్రేమ, పట్టుదలతో.. ఆశ నింపి, శాసించే స్థాయి వరకు తీసుకొని వెళ్లడం చాలా తక్కువ మందికి, ప్రత్యేకంగా మహిళలకు సాధ్యం. అది నేను అమ్మలో, సుధామూర్తి గారిలో ఇంకా YS భారతి గారిలో చూశాను. అంతే శక్తి నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి అయిన సుధామూర్తి.. భర్తకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆమె ఇచ్చిన డబ్బుతోనే నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు. ఇక భారతి విషయానికి వస్తే.. జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆమె ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. సాక్షి దిన పత్రిక సహా వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించారు. కష్ట సమయంలో భర్తకు అండగా నిలిచారు. తనకు కూడా ఇలాంటి శక్తిని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. అకస్మాత్తుగా ఆమె భారతిని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
పూనమ్ కౌర్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ‘‘కొందరు నటులు తమ పొలిటికల్ కెరీర్ కోసం.. అమాయక ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. మరికొందరేమో అమాయక ప్రజలను రక్షించడం కోసం తమ ప్రాణాలను రిస్క్ చేస్తున్నారు’’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.
పూనమ్ కౌర్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ‘‘కొందరు నటులు తమ పొలిటికల్ కెరీర్ కోసం.. అమాయక ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. మరికొందరేమో అమాయక ప్రజలను రక్షించడం కోసం తమ ప్రాణాలను రిస్క్ చేస్తున్నారు’’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.