యాప్నగరం

జగన్ సర్కార్‌పై తప్పుడు ప్రచారం.. ఆ పరిశ్రమలు ఎక్కడికి వెళ్లలేదు

పరిశ్రమలు ఏపీ నుంచి తరలి వెళ్లిపోయినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ విధానాల వల్లే ఇబ్బందులు.. ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నామన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

Samayam Telugu 7 Nov 2019, 9:35 am
ఏపీ నుంచి కంపెనీలు తరలిపోయాయంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. రాష్ట్రం నుంచి రిలయన్స్, అదానీ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకొని వెళ్లిపోతున్నాయని కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. పరిశ్రమలకు భూములు ఇచ్చేందుకు కొన్ని విధానాలుంటాయని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పరిశ్రమలకు త్వరగా భూములు, అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.
Samayam Telugu jagan..


Read Also: ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త

తిరుపతిలో రిలయన్స్‌కు కేటాయించిన భూముల విషయంలో రైతుల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయని.. కోర్టులో వివాదం నడుస్తుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం వివాదస్పదమైన భూములను రిలయన్స్‌ గ్రూపునకు కేటాయించిందని.. ప్రస్తుత ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ప్రత్యామ్నాయ భూములను ఇవ్వడానికి ప్రయత్నిస్తోందన్నారు. గతంలో కేటాయించిన 136 ఎకరాల భూమిపై 15 మంది రైతులు కోర్టులో కేసులు దాఖలు చేయడంతో ఆ భూములను రిలయన్స్‌ వినియోగించుకోలేక పోతోందని తెలిపారు.

త్వరలోనే రిలయన్స్‌ సంస్థ ప్రతినిధులతో చర్చించనున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. అదాని ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఐటీ శాఖ అదాని గ్రూపు ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తోందన్నారు. ఇకపై మీడియా సంస్థలు అవాస్తవ కథనాలను ప్రచారం చేయవద్దని మంత్రి కోరారు. ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేలా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.