యాప్నగరం

ఏపీ కాంగ్రెస్‌లో భారీగా నియామకాలు.. మాజీ సీఎంకు పదవి

ఏపీ కాంగ్రెస్‌లో ఏఐసీపీ భారీగా నియామకాలు చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి రెండు కమిటీల్లో స్థానం దక్కింది.

Samayam Telugu 21 Feb 2020, 8:47 pm
ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఏపీసీసీ) ఆఫీస్‌ బేరర్స్‌, డీసీసీ అధ్యక్షులను శుక్రవారం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లను ఖరారు చేసింది. అలాగే 29 మందితో కో-ఆర్డినేషన్ కమిటీ, 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది.
Samayam Telugu kiran


మరో 18 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీల్లో స్థానం కల్పించారు.

రాజకీయ వ్యవహారాల కమిటీకి చైర్మన్‌గా పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ వ్యవహరిస్తారు. సమన్వయ కమిటీకి చైర్మన్‌గా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ ఉంటారు. యూత్‌ కాంగ్రెస్‌, ఎన్ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్‌, సేవాదళ్‌ చైర్మన్‌లు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. పీపీసీ మాజీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డికి కూడా ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.