యాప్నగరం

నిలకడగా గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్యం..

Samayam Telugu 29 Nov 2021, 6:42 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న ఆయన నిన్న రాత్రి కొంత అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Samayam Telugu గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్


గవర్నర్‌ హరిచందన్‌‌కు నవంబర్ 15వ తేదీన కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. పూర్తిగా కోలుకున్న తర్వాత 23వ తేదీ డిశ్చార్జ్ అయ్యి.. మళ్లీ విజయవాడ చేరుకున్నారు. అయితే వారం రోజుల్లోనే ఆయన మరోసారి అస్వస్థతకు గురవడంతో నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికా వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో.. ఆ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. అయితే.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ఈ వేరియంట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో, తీవ్రత ఏ మేరకు ఉంటుందో అనే దానిపై మాత్రం అనిశ్చితి నెలకొని ఉందని వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.