యాప్నగరం

Amaravati ద్రోహులకు గాజులు, చీర, పువ్వులు.. రైతుల వినూత్న నిరసన

మందడంలో 234వ రోజు అమరావతి ద్రోహులకు చీర సారే బహుమానంగా ఇచ్చారు. అమరావతి తరలిస్తే రాజీనామా చేస్తాం, అమరావతి అంగుళం కూడా కదలదు తమ నాయకుడు ఇక్కడే ఉంటారు.. ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, రాజధాని ఎందుకు తరలిస్తాం అని ప్రజలని నమ్మించి కొంతమంది మోసం చేశారని మండిపడ్డారు.

Samayam Telugu 7 Aug 2020, 1:41 pm
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో నిరసనలు కొనసాగుతున్నాయి. అమరావతి గ్రామాల్లో రైతులు రోజుకో విధంగా ఆందోళనలు చేస్తున్నారు. మందడంలో 234వ రోజు అమరావతి ద్రోహులకు చీర సారే బహుమానంగా ఇచ్చారు. అమరావతి తరలిస్తే రాజీనామా చేస్తాం, అమరావతి అంగుళం కూడా కదలదు తమ నాయకుడు ఇక్కడే ఉంటారు.. ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, రాజధాని ఎందుకు తరలిస్తాం అని ప్రజలని నమ్మించి కొంతమంది మోసం చేశారని మండిపడ్డారు.
Samayam Telugu అమరావతి రైతుల నిరసన


అమరావతి ద్రోహులు గాజులు, చీర, పువ్వులు పెట్టుకుని ఇంట్లో కూర్చోమని.. వారి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ చీరని బహుమతిగా ఇచ్చారు. మహిళా రైతులు వినూత్నంగా ఇలా నిరసన తెలియజేశారు. అమరావతి నినాదాలతో హోరెత్తించారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపి.. గెజిట్ విడుదల చేశారు.. ఆ రోజు నుంచి అమరావతి రైతులు ఉద్యమాన్ని మళ్లీ హోరెత్తిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.