యాప్నగరం

ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు పాలాభిషేకాలు

శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌కు అమరావతిలో రైతులు, టీడీపీ నేతల పాలాభిషేకాలు.. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఛైర్మన్ వ్యవహరించారని ప్రశంసించారని ప్రశంసలు.

Samayam Telugu 23 Jan 2020, 3:16 pm
ఏపీ శాసనమండలి ఛైర్మన్‌కు అమరావతి రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు. తమకు అండగా నిలబడి.. మండలిలో బిల్‌ను అడ్డుకున్నారని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. రాజధాని గ్రామాల్లో రైతులు, అమరావతి జేఏసీ, టీడీపీ నేతలు ఛైర్మన్ షరీఫ్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. మంగళగిరి తుళ్లూరు, రాయపూడి, మందడంతో పాటూ మరికొన్ని చోట్ల పాలాభిషేకం నిర్వహించారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఛైర్మన్ వ్యవహరించారని ప్రశంసించారు.

శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు విషయంలో తమకు తాత్కాలికంగా ఊరటగా భావిస్తున్నామని అమరావతి రైతులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామంటున్నారు. ప్రభుత్వం రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదని రైతులు చెబుతున్నారు.

అంతేకాదు బుధవారం కూడా శాసనమండలి ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతి గ్రామాల మీదుగా వెళ్లారు. మధ్యలో మందడం దగ్గర చంద్రబాబుకు రైతులు స్వాగతం పలికారు.. తమకు అండగా పోరాడినందుకు ధన్యవాదాలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.